ETV Bharat / state

చాట్రాయిలో తెలంగాణ మద్యం.. 488 సీసాలు స్వాధీనం

author img

By

Published : Jun 3, 2020, 5:49 PM IST

రాష్ట్రానికి... తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ కాపు కాసి తనిఖీలు చేస్తున్నా.. మద్య ప్రవాహం మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. తాజాగా.. కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో తెలంగాణ నుంచి నిందితులు తరలిస్తున్న 488 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

telangama liquor seized in krishna dst chatray mandal
telangama liquor seized in krishna dst chatray mandal

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చాట్రాయి మండలం గుడిపాడు డొంక రోడ్డు వద్ద ఈ వ్యవహారాన్ని గుర్తించారు. ముగ్గురి నుంచి.. 488 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. చాట్రాయి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. చాట్రాయి మండలం గుడిపాడు డొంక రోడ్డు వద్ద ఈ వ్యవహారాన్ని గుర్తించారు. ముగ్గురి నుంచి.. 488 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. చాట్రాయి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

రంగులు తొలగించకుండా తప్పు చేశారు:సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.