కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయిలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వందలాది మంది ఉపాధ్యాయులు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తమకు జీవో నెం 91 ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఆందోళచేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే పదవతరగతి మూల్యాంకనం బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
