కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని దిండిమెరక గ్రామంలో 104 సంచార వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం ఏర్పాటు చేసేందుకు పాఠశాల లోపలికి వెళ్లేందుకు యత్నించిన వైద్య సిబ్బందిని ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ప్రధాన ద్వారానికి తాళం వేశారు.
సంచార వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు పాఠశాలలో ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. చేసేదేమీ లేక చెట్ల కిందనే శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంపు నిర్వహణకు సచివాలయ అధికారులను బాధ్యులను చేసి, శిబిరాన్ని సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని వైద్య సిబ్బంది కోరారు.
ఇదీ చదవండి: