ETV Bharat / state

'ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మాని... ప్రతిపక్షంపై విమర్శలేంటి?'

author img

By

Published : Sep 21, 2020, 6:36 PM IST

వైకాపా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించటం మాని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... తెదేపాను విమర్శించటం బాధాకరమన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ప్రతిపక్షాన్ని విమర్శిస్తే జగన్​కు మేలు చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

Chinarajappa
Chinarajappa

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... తెదేపాను విమర్శించటం ముఖ్యమంత్రి జగన్​కు మేలు చేయడమేనని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవాదాయ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనకు నిరసన వ్యక్తం చేసిన 37 మంది భాజపా కార్యకర్తలపై అక్రమ నిర్భందం చేసిన నియంత జగన్ అని మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై జగన్​ను ఎండగట్టాల్సింది పోయి... తమను సోము వీర్రాజు విమర్శించడం బాధాకరమని చినరాజప్ప పేర్కొన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... తెదేపాను విమర్శించటం ముఖ్యమంత్రి జగన్​కు మేలు చేయడమేనని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, దేవాదాయ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనకు నిరసన వ్యక్తం చేసిన 37 మంది భాజపా కార్యకర్తలపై అక్రమ నిర్భందం చేసిన నియంత జగన్ అని మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై జగన్​ను ఎండగట్టాల్సింది పోయి... తమను సోము వీర్రాజు విమర్శించడం బాధాకరమని చినరాజప్ప పేర్కొన్నారు.

ఇదీ చదవండి

రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.