ETV Bharat / state

'నేరమే  జరగకుండా.. చంద్రబాబు ఎలా నేరస్థుడు అవుతారు?'

అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై పెట్టిన కేసు న్యాయస్థానాల్లో నిలవదని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నష్టం జరిగితే బాధితులు ఫిర్యాదు చేయాలనిని.. ప్రత్యర్థులు కాదన్నారు.

author img

By

Published : Mar 18, 2021, 2:17 PM IST

Updated : Mar 18, 2021, 2:45 PM IST

tdp leader somi
tdp leader somi

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును తప్పు బట్టే అధికారం న్యాయస్థానానికి తప్ప సీఐడీకి లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నష్టం జరిగితే ఫిర్యాదు చేయాల్సింది బాధితులే అని అన్నారు. అంతే కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి కాదని స్పష్టం చేశారు. బాధితులు, లబ్ధిదారులు లేని ఫిర్యాదు క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

బాధితులు, లాభికులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని సీఐడీ ఎలా తప్పుబడుతుందని నిలదీశారు. అసలు నేరమే లేకుండా తెదేపా అధినేత చంద్రబాబు నేరస్థులు ఎలా అవుతారన్నారని అన్నారు. దురుద్దేశంతో పెట్టిన కేసుకు విచారణ అర్హత ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును తప్పు బట్టే అధికారం న్యాయస్థానానికి తప్ప సీఐడీకి లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నష్టం జరిగితే ఫిర్యాదు చేయాల్సింది బాధితులే అని అన్నారు. అంతే కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి కాదని స్పష్టం చేశారు. బాధితులు, లబ్ధిదారులు లేని ఫిర్యాదు క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

బాధితులు, లాభికులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని సీఐడీ ఎలా తప్పుబడుతుందని నిలదీశారు. అసలు నేరమే లేకుండా తెదేపా అధినేత చంద్రబాబు నేరస్థులు ఎలా అవుతారన్నారని అన్నారు. దురుద్దేశంతో పెట్టిన కేసుకు విచారణ అర్హత ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం: నేడు సీఐడీ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే హాజరు

Last Updated : Mar 18, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.