ప్రభుత్వ ఆదేశానుసారం భూములను సర్వే చేసి ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో సర్వే ఆఫ్ ఇండియా వారిచే డ్రోన్ ద్వారా రీసర్వేను ప్రారంభించారు. పారదర్శకతతో కూడిన భూములకు సరిహద్దులు, హక్కుదారులకు ప్రభుత్వంతో ధ్రువీకరణ పత్రాల అందజేత, నిజనిర్ధారణ వంటి పనులు జరుగుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ విధమైన భూ వ్యాజ్యాలు తలెత్తబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడు తహసీల్దార్ ఎం.సురేష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి జి. రాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
కోడింగ్ నైపుణ్యం ఉంటే బీటెక్ విద్యార్థులకు కంపెనీల బ్రహ్మరథం