ETV Bharat / state

అర్ధరాత్రి కారు ప్రమాదం.. భార్య, బిడ్డలను కాపాడలేని దైన్యం..!

author img

By

Published : Aug 5, 2020, 1:02 AM IST

చుట్టూ చీకటి.. పదడుగుల లోతు నీరు. కారుతో సహా కాలువలో మునిగిపోతున్న భార్య, కుమారుణ్ని రక్షించాలన్న తపన ఓ వైపు. అప్పటికే నీటిఒడ్డుకు చేర్చి పడుకోబెట్టిన 11 నెలల మరో చిన్నారి తిరిగి నీటిలోకి జారిపోతున్నాడన్న భయం మరోవైపు. దాదాపు అరగంట సేపు వారి ప్రాణాలు కాపాడాలన్న ఆ వ్యక్తి పోరాటం ఫలించలేదు. కళ్లెదుటే భార్య, ఆరేళ్ల కుమారుడి మృతిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు ఆ తండ్రి. కృష్ణా జిల్లాలోని చోడవరం వద్ద కరువు కాల్వగట్టుపై సోమవారం అర్ధరాత్రి జరిగిన దయనీయ ఘటన వివరాలివి..!

అర్ధరాత్రి కారు ప్రమాదం.. భార్య, బిడ్డలను కాపాడలేని దైన్యం..!
అర్ధరాత్రి కారు ప్రమాదం.. భార్య, బిడ్డలను కాపాడలేని దైన్యం..!

చోడవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన కిరణ్​కుమార్​.. ఈనెల 3వ తేదీన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు అవనిగడ్డలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి 10 గంటలకు పెనుమాక బయలుదేరాడు. కరకట్ట మార్గంలో ప్రయాణిస్తూ.. చోడవరం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తోన్న మరో కారును తప్పించబోయి వీరి వాహనం అదుపు తప్పి.. కాల్వ వైపు దూసుకుపోయింది. కారు ముందు సీట్లో భార్య దుర్గా మహాలక్ష్మి కూర్చోగా.. ఈమె ఒళ్లో వీరి రెండో కుమారుడు 11 నెలల తక్షిత్​ ఉన్నాడు. వెనుక సీట్లో పెద్ద కుమారుడు శ్రీమహంత్​ నిద్రపోతున్నాడు. కారు కాల్వలోకి పడిపోగానే కిరణ్ కుమార్ వెంటనే అద్దాలు పగలగొట్టి చిన్నారి తక్షిత్​ను తీసుకొని ఒడ్డుకు చేర్చాడు.

భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు తిరిగి కాల్వలోకి దిగే ప్రయత్నం చేయగా.. ఒడ్డుకు చేర్చిన చిన్నారి తిరిగి కాల్వలోకి జారిపోయాడు. వెంటనే కిరణ్ కుమార్ ఈ చిన్నారిని కట్టపైకి చేర్చాడు. ఈ ప్రయత్నంలో భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు సమయం చాలలేదు. కరకట్టపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి భార్య, పెద్ద కుమారుణ్ని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. కళ్లెదుటే భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం కిరణ్​కుమార్​ను షాక్​కు గురి చేసింది. వారి మృతదేహాలను చూసి మృత్యుంజయుడైన చిన్నారిని హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. సమాచారం అందుకున్న పెనమలూరు సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేశ్​లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్వలో మునిగిపోయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చోడవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన కిరణ్​కుమార్​.. ఈనెల 3వ తేదీన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు అవనిగడ్డలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి 10 గంటలకు పెనుమాక బయలుదేరాడు. కరకట్ట మార్గంలో ప్రయాణిస్తూ.. చోడవరం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తోన్న మరో కారును తప్పించబోయి వీరి వాహనం అదుపు తప్పి.. కాల్వ వైపు దూసుకుపోయింది. కారు ముందు సీట్లో భార్య దుర్గా మహాలక్ష్మి కూర్చోగా.. ఈమె ఒళ్లో వీరి రెండో కుమారుడు 11 నెలల తక్షిత్​ ఉన్నాడు. వెనుక సీట్లో పెద్ద కుమారుడు శ్రీమహంత్​ నిద్రపోతున్నాడు. కారు కాల్వలోకి పడిపోగానే కిరణ్ కుమార్ వెంటనే అద్దాలు పగలగొట్టి చిన్నారి తక్షిత్​ను తీసుకొని ఒడ్డుకు చేర్చాడు.

భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు తిరిగి కాల్వలోకి దిగే ప్రయత్నం చేయగా.. ఒడ్డుకు చేర్చిన చిన్నారి తిరిగి కాల్వలోకి జారిపోయాడు. వెంటనే కిరణ్ కుమార్ ఈ చిన్నారిని కట్టపైకి చేర్చాడు. ఈ ప్రయత్నంలో భార్య, పెద్ద కుమారుణ్ని రక్షించేందుకు సమయం చాలలేదు. కరకట్టపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి భార్య, పెద్ద కుమారుణ్ని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. కళ్లెదుటే భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం కిరణ్​కుమార్​ను షాక్​కు గురి చేసింది. వారి మృతదేహాలను చూసి మృత్యుంజయుడైన చిన్నారిని హత్తుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. సమాచారం అందుకున్న పెనమలూరు సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేశ్​లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్వలో మునిగిపోయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

సిబ్బంది నిర్లక్ష్యం.. రుయా ఆస్పత్రి నుంచి కరోనా రోగి మాయం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.