ETV Bharat / state

ఫలించిన రామ్‌కో వలస కార్మికుల పోరాటం - ధర్మవరప్పాడు రామ్‌కో-ఎల్‌అండ్‌టీలో వలస కూలీలు

50 రోజుల నిరీక్షణ అనంతరం ధర్మవరప్పాడు రామ్‌కో - ఎల్ ‌అండ్ ‌టీ కార్మికులను.. వారి స్వరాష్ట్రాలకు పంపే కార్యక్రమం ప్రారంభమైంది.

ఎట్టకేలకు ఫలించిన రామ్‌కో వలస కార్మికుల పోరాటంఫలించిన రామ్‌కో కార్మికుల పోరాటం
ఎట్టకేలకు ఫలించిన రామ్‌కో వలస కార్మికుల పోరాటంఫలించిన రామ్‌కో కార్మికుల పోరాటం
author img

By

Published : May 14, 2020, 9:15 AM IST

కృష్ణా జిల్లా ధర్మవరప్పాడులోని రామ్‌కో - ఎల్‌ అండ్ ‌టీ పరిశ్రమ వలస కార్మికుల పోరాటం ఫలించింది. సుమారు 1500 మంది కార్మికులను స్వరాష్ట్రాలకు పంపే కార్యక్రమం మొదలైంది. తొలుత ఝార్ఖండ్‌కు చెందిన 600 మందిని 19 బస్సుల్లో రైల్వేస్టేషన్‌కి తరలించారు. ఇంకో 900 మందిని రెండు రోజుల్లో తరలిస్తామని అధికారులు తెలిపారు.

స్వస్థలాలకు వెళ్తున్న వారికి మిగిలినవారు సంతోషంగా వీడ్కోలు పలికారు. ఇక.. 50 రోజుల నిరీక్షణతో విసిగిపోయిన కార్మికులు కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. అందులో భాగంగా 2 రోజుల క్రితం సీఐ నాగేంద్రను కూడా నిర్బంధించారు. ఎట్టకేలకు తమ ఆకాంక్ష నెరవేర్చడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా ధర్మవరప్పాడులోని రామ్‌కో - ఎల్‌ అండ్ ‌టీ పరిశ్రమ వలస కార్మికుల పోరాటం ఫలించింది. సుమారు 1500 మంది కార్మికులను స్వరాష్ట్రాలకు పంపే కార్యక్రమం మొదలైంది. తొలుత ఝార్ఖండ్‌కు చెందిన 600 మందిని 19 బస్సుల్లో రైల్వేస్టేషన్‌కి తరలించారు. ఇంకో 900 మందిని రెండు రోజుల్లో తరలిస్తామని అధికారులు తెలిపారు.

స్వస్థలాలకు వెళ్తున్న వారికి మిగిలినవారు సంతోషంగా వీడ్కోలు పలికారు. ఇక.. 50 రోజుల నిరీక్షణతో విసిగిపోయిన కార్మికులు కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. అందులో భాగంగా 2 రోజుల క్రితం సీఐ నాగేంద్రను కూడా నిర్బంధించారు. ఎట్టకేలకు తమ ఆకాంక్ష నెరవేర్చడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

స్వస్థలాలకు తరలిన 22 మంది వలస కూలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.