కృష్ణా జిల్లా గన్నవరం విమానశ్రయానికి ముందుగానే నూతన సంవత్సర శోభ వచ్చింది. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2020 ఏడాదికి స్వాగతం చెప్తూ... వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎయిర్పోర్టు ఆవరణమంతా రంగవల్లులు, విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో పాటు ప్రయాణికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చిన్నారుల ఫ్యాషన్ షో అదుర్స్..!