ETV Bharat / state

తెలంగాణ రాష్ట్రానికి కొత్త డబుల్ డెక్కర్ బస్సులు - RTC Double Decker Buses

New Double Decker Buses to state: కొన్ని సంవత్సరాల కిందట మాయమైన డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే ఏడాది తెలంగాణలోని హైదరాబాద్‌కు రానున్నాయి. అప్పట్లో ఎంతో ఆదరణ ఉన్న వీటికి ఇప్పటికీ అంతే డిమాండ్ ఉంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కొన్ని కొత్త బస్సులను అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే.

డబుల్ డెక్కర్ బస్సులు
state rtc
author img

By

Published : Oct 21, 2022, 12:49 PM IST

New Double Decker Buses to state: కొన్ని సంవత్సరాల కిందట మాయమైన డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే ఏడాది హైదరాబాద్‌కు రానున్నాయి. వీటిలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతూ పలుమార్లు విజ్ఞప్తి చేయగా, వారిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ అందుబాటులోకి తేనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు కొత్తగా బస్సులు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇవన్నీ విద్యుత్ తో నడిచే బస్సులే.

వచ్చే ఏడాది రానున్న బస్సులన్నీ ప్రభుత్వం అద్దెకు తీసుకోనుంది. ఇందులో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులున్నాయి. వచ్చేనెల 21 వరకు టెండరు దాఖలు చేయాలని సంస్థ సూచించింది. సొంతంగా కొనలేక మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు విశ్వనగర కీర్తి దిశగా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని టీఎస్‌ ఆర్టీసీ భావించింది. గతంలో అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ ద్వారా కొనాలని నిర్ణయించినా, తర్వాత ఆర్థిక వనరులు సమకూరక వెనక్కి తగ్గింది.

ఒక్కో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ధర రూ.2 కోట్లకు పైగా ఉండడం, కేంద్రం రాయితీ రూ.30 లక్షలకే పరిమితమవటంతో నేరుగా కొనాలనే ఉద్దేశాన్ని విరమించుకుంది. 10 డబుల్‌ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది. ఎలక్ట్రికల్‌ బస్సులు నగరమంతటా నడవనుండగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు మాత్రం ఆటంకం లేని వంతెనల మార్గాల్లోనే నడవనున్నాయి.

ఇవీ చదవండి:

New Double Decker Buses to state: కొన్ని సంవత్సరాల కిందట మాయమైన డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే ఏడాది హైదరాబాద్‌కు రానున్నాయి. వీటిలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతూ పలుమార్లు విజ్ఞప్తి చేయగా, వారిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ అందుబాటులోకి తేనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు కొత్తగా బస్సులు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇవన్నీ విద్యుత్ తో నడిచే బస్సులే.

వచ్చే ఏడాది రానున్న బస్సులన్నీ ప్రభుత్వం అద్దెకు తీసుకోనుంది. ఇందులో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులున్నాయి. వచ్చేనెల 21 వరకు టెండరు దాఖలు చేయాలని సంస్థ సూచించింది. సొంతంగా కొనలేక మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు విశ్వనగర కీర్తి దిశగా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని టీఎస్‌ ఆర్టీసీ భావించింది. గతంలో అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ ద్వారా కొనాలని నిర్ణయించినా, తర్వాత ఆర్థిక వనరులు సమకూరక వెనక్కి తగ్గింది.

ఒక్కో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ధర రూ.2 కోట్లకు పైగా ఉండడం, కేంద్రం రాయితీ రూ.30 లక్షలకే పరిమితమవటంతో నేరుగా కొనాలనే ఉద్దేశాన్ని విరమించుకుంది. 10 డబుల్‌ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది. ఎలక్ట్రికల్‌ బస్సులు నగరమంతటా నడవనుండగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు మాత్రం ఆటంకం లేని వంతెనల మార్గాల్లోనే నడవనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.