ETV Bharat / state

ఇంద్రకీలాద్రిలో ముగిసిన నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు.

author img

By

Published : Dec 31, 2020, 2:52 PM IST

Natarajaswamy aardrostavalu
ఇంద్రకీలాద్రిలో ముగిసిన నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు నిర్వహించిన నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు ముగిశాయి. శివ కామసుందరీ దేవ సమేత నటరాజ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున పూజాద్రవ్యాలు ఉంచిన పట్టు వస్త్రాన్ని మూటగా కట్టి మూడుసార్లు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత అగ్నిదేవునికి సమర్పించారు. అనంతరం స్వామి వార్ల ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిలో చివరిరోజు నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు

ఇదీ చదవండి: వేడుకగా అశ్వర్థ నారాయణ కళ్యాణం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు నిర్వహించిన నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు ముగిశాయి. శివ కామసుందరీ దేవ సమేత నటరాజ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున పూజాద్రవ్యాలు ఉంచిన పట్టు వస్త్రాన్ని మూటగా కట్టి మూడుసార్లు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత అగ్నిదేవునికి సమర్పించారు. అనంతరం స్వామి వార్ల ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిలో చివరిరోజు నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు

ఇదీ చదవండి: వేడుకగా అశ్వర్థ నారాయణ కళ్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.