ETV Bharat / state

'నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి' - nagayalanka latest news

నాగాయలంకలోని నివేశనా స్థలాలకు అర్హులైన లబ్దిదారులు ఆందోళనకు దిగారు. తమకు గ్రామంలోనే స్థలాలు ఇప్పించాలంటూ అధికారులను అడిగారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్​ బాబుకి ఈ విషయాన్ని తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

'నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి'
'నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి'
author img

By

Published : Jul 6, 2020, 10:25 PM IST

Updated : Jul 7, 2020, 10:24 AM IST

కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో ఇళ్ల స్థలాల లబ్దిదారులు ఆందోళనకు దిగారు. నాగాయలంకలో కొందరికి... మిగతా వారికి నాగాయలంక పక్కన ఉన్న వక్కపట్ల వారిపాలెంలో స్థలాలు ఎందుకు ఇస్తున్నారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​ బాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. తమకు నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాగాయలంకలో స్థలాలు లేవని.. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో ఇళ్ల స్థలాల లబ్దిదారులు ఆందోళనకు దిగారు. నాగాయలంకలో కొందరికి... మిగతా వారికి నాగాయలంక పక్కన ఉన్న వక్కపట్ల వారిపాలెంలో స్థలాలు ఎందుకు ఇస్తున్నారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​ బాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. తమకు నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాగాయలంకలో స్థలాలు లేవని.. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:

అభాగ్యులకు ఆహారం అందించిన నాగాయలంక పోలీసులు

Last Updated : Jul 7, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.