ETV Bharat / state

తెలంగాణలో పురపోరు ...భవితవ్యం తేలేది నేడే!

తెలంగాణ పట్టణ, నగర ప్రజాప్రతినిధులు ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. నగర, పురపాలక సంస్థల్లోని 2,971 వార్డుల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలీటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి.

author img

By

Published : Jan 25, 2020, 6:44 AM IST

telangana municipal elections results
తెలంగాణ పురపోరు ఫలితాలు

తొమ్మిది నగర పాలకసంస్థలు, 120 పురపాలక సంస్థలు, మొత్తం 3,052 వార్డులు, దాదాపు 13వేల మంది అభ్యర్థులు, 50లక్షల వరకు ఓటర్లు. హోరాహోరీగా సాగిన తెలంగాణ పురపోరు ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ఏకగ్రీవాలతో కలిపితే కార్పొరేటర్, మున్సిపాలిటీల్లో మొత్తం 3,052 వార్డులున్నాయి. వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12వేల 948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలపరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2,975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2,619 మంది, భాజపా నుంచి 2,321 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3,760 మంది ఉన్నారు.

ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నిజామాబాద్ లెక్కింపు కోసం ఐదు, బడంగ్ పేట్, నారాయణ్ ఖేడ్ లెక్కింపు కోసం రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటి లెక్కింపు కోసం ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియకు మొత్తం పది వేల మంది సిబ్బందిని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి అందులోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక విజేతను ప్రకటించే ముందు సంబంధిత రిటర్నింగ్ అధికారి ఎన్నికల పరిశీలకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే తుదిఫలితానికి సంబంధించిన షీట్‌పై సంతకం చేసి విజేతలను ప్రకటించాలని స్పష్టం చేసింది.

తెలంగాణలో పురపోరు ...భవితవ్యం తేలేది నేడే!

ఇవీ చూడండి: విజయవాడ చేరుకున్న తెలంగాణ పోలీసులు

తొమ్మిది నగర పాలకసంస్థలు, 120 పురపాలక సంస్థలు, మొత్తం 3,052 వార్డులు, దాదాపు 13వేల మంది అభ్యర్థులు, 50లక్షల వరకు ఓటర్లు. హోరాహోరీగా సాగిన తెలంగాణ పురపోరు ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ఏకగ్రీవాలతో కలిపితే కార్పొరేటర్, మున్సిపాలిటీల్లో మొత్తం 3,052 వార్డులున్నాయి. వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12వేల 948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలపరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2,975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2,619 మంది, భాజపా నుంచి 2,321 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3,760 మంది ఉన్నారు.

ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నిజామాబాద్ లెక్కింపు కోసం ఐదు, బడంగ్ పేట్, నారాయణ్ ఖేడ్ లెక్కింపు కోసం రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటి లెక్కింపు కోసం ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియకు మొత్తం పది వేల మంది సిబ్బందిని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి అందులోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక విజేతను ప్రకటించే ముందు సంబంధిత రిటర్నింగ్ అధికారి ఎన్నికల పరిశీలకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే తుదిఫలితానికి సంబంధించిన షీట్‌పై సంతకం చేసి విజేతలను ప్రకటించాలని స్పష్టం చేసింది.

తెలంగాణలో పురపోరు ...భవితవ్యం తేలేది నేడే!

ఇవీ చూడండి: విజయవాడ చేరుకున్న తెలంగాణ పోలీసులు

File : TG_Hyd_02_25_Counting_Pkg_3053262 From : Raghu Vardhan ( ) పట్టణ, నగర ప్రజాప్రతినిధులెవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. నగర, పురపాలక సంస్థల్లోని 2971 వార్డుల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. తొమ్మిది కార్పోరేషన్లు, 120 మున్సిపాల్టీల ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం 134 కేంద్రాల్లో 2559 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన దాదాపు 12వేలా 948 మంది భవితవ్యం తేలనుంది...లుక్ వాయిస్ ఓవర్ - తొమ్మిది నగర పాలకసంస్థలు, 120 పురపాలక సంస్థలు... మొత్తం 3052 వార్డులు... దాదాపు 13వేల మంది అభ్యర్థులు... 50లక్షల వరకు ఓటర్లు. హోరాహోరీగా సాగిన పురపోరు ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ఏకగ్రీవాలతో కలిపితే కార్పోరేటర్, మున్సిపాల్టీల్లో మొత్తం 3052 వార్డులున్నాయి. వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12వేలా 948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీల పరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2619 మంది, భాజపా నుంచి 2321 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ పార్టీ అభ్యర్థులుగా 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3760 మంది ఉన్నారు. తొమ్మిది నగరపాలకసంస్థల్లో 325 వార్డులు ఉండగా... ఒకటి ఏకగ్రీవం అయింది. 120 మున్సిపాల్టీల్లో 2727 వార్డులుండగా... 80 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 324 కార్పోరేటర్, 2647 కౌన్సిలర్ స్థానాలకు ఈ నెల 22న ఓటింగ్ జరిగింది. కార్పోరేషన్లలో 58.83 శాతం, పురపాలికల్లో 74.40 శాతం ఓటింగ్ జరిగింది. ఆ ఓట్ల లెక్కింపు నేడు పూర్తి కానుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2971 వార్డుల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. మొత్తం 129 కార్పోరేషన్లు, మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు కోసం 134 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లెక్కింపు కోసం ఐదు, బడంగ్ పేట్, నారాయణ్ ఖేడ్ లెక్కింపు కోసం రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటి లెక్కింపు కోసం ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. మొత్తం అన్ని లెక్కింపు కేంద్రాల్లో కలిపి 2559 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కనీసం ముగ్గురు చొప్పున లెక్కింపు సిబ్బంది ఉంటారు. మొత్తంగా పది వేల మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరిచి అందులోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక విజేతను ప్రకటించే ముందు సంబంధిత రిటర్నింగ్ అధికారి ఎన్నికల పరిశీలకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే తుదిఫలితానికి సంబంధించిన షీట్ పై సంతకం చేసి విజేతలను ప్రకటించాలని స్పష్టం చేసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.