ETV Bharat / state

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై హైకోర్టులో నేడు విచారణ

author img

By

Published : Mar 23, 2021, 7:52 PM IST

Updated : Mar 24, 2021, 5:03 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.... తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

జనసేన పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా
జనసేన పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా

పరిషత్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... విచారణ నేటికి వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలంటూ ఎస్‌ఈసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

ఎన్నికలు జరపాలా వద్దా అనేది పూర్తిగా ఎస్‌ఈసీ పరిధిలోని అంశమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

పరిషత్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... విచారణ నేటికి వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలంటూ ఎస్‌ఈసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

ఎన్నికలు జరపాలా వద్దా అనేది పూర్తిగా ఎస్‌ఈసీ పరిధిలోని అంశమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీని ఆదేశించలేం: హైకోర్టు

Last Updated : Mar 24, 2021, 5:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.