ETV Bharat / state

'ఉపాధి హామీ నిధులను వెంటనే విడుదల చేయాలి' - latest news about upadhihammi

ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శాసనమండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉపాధి హామీ నిధులపై చర్చించారు.

ఉపాధి హామీ నిధులు
author img

By

Published : Oct 4, 2019, 6:54 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న వైవీబీ రాజేంద్రప్రసాద్

ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శాసన మండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన... సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గత ఏడాది 2వేల కోట్ల పనులు చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తెదేపా నాయకులనే కారణంతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకపోతే 'ఛలో అమరావతి' కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వైవీబీ రాజేంద్రప్రసాద్

ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శాసన మండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన... సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గత ఏడాది 2వేల కోట్ల పనులు చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తెదేపా నాయకులనే కారణంతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకపోతే 'ఛలో అమరావతి' కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి

ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన

Intro:ap_tpg_82_4_samajikatlikee_ab_ap10162


Body:దెందులూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు . ఉపాధి హామీ పథకం ఏపీ డి నాగరాజు జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీదేవి ఎంపీడీవో లక్ష్మీల పర్యవేక్షణలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించిన డి ఆర్ పీ లు గుర్తించిన లోపాలను చదివి వినిపించారు. మండలంలో సుమారు 53 లక్షల విలువైన మొక్కలు క్షేత్ర స్థాయిలో లేవని గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 32 వేలు దుర్వినియోగం అయ్యాయని అన్నారు . ఆయా శాఖలకు సంబంధించి సుమారు 28 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. ఆయా పనుల్లో లోపాలను గుర్తించి రికవరికి సంబంధించి తీసుకుంటామన్నారు. ఎస్ ఆర్ పి లు నందిని దేవరాజ్ సాంకేతిక సహాయకులు క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.