ETV Bharat / state

సీఎం సహాయ నిధికి మెప్మా ఉద్యోగుల విరాళం

author img

By

Published : May 16, 2020, 4:16 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మెప్మా ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ నిర్మూలకు సీఎం సహాయ నిధికి 8 లక్షల 10 వేల చెక్కును అందించారు.

mepma employees donation to cm relief fund
సీఎం సహాయ నిధికి మెప్మా ఉద్యోగుల విరాళం

కరోనా నివారణ చర్యలకు తమవంతు సాయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మెప్మా ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 8 లక్షల 10 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమక్షంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... యాచకులకు, పేదలకు స్థానిక పాఠశాలలో భోజన ఏర్పాటు కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు ప్రతిరోజు బాధ్యతగా ఏర్పాట్లు చూస్తున్నారని కితాబిచ్చారు.

కరోనా నివారణ చర్యలకు తమవంతు సాయంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మెప్మా ఉద్యోగులు ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 8 లక్షల 10 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమక్షంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... యాచకులకు, పేదలకు స్థానిక పాఠశాలలో భోజన ఏర్పాటు కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు ప్రతిరోజు బాధ్యతగా ఏర్పాట్లు చూస్తున్నారని కితాబిచ్చారు.

ఇదీ చదవండి: వలస కార్మికుల వసతి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.