ETV Bharat / state

సహజీవనానికి ఒప్పుకోలేదని... పీక కోశాడు!

విజయవాడలోని మొగల్రాజపురంలో మహిళపై ఓ ఆగంతుకుడు కత్తితో దాడి చేశాడు.

author img

By

Published : Sep 5, 2019, 11:40 PM IST

Updated : Sep 6, 2019, 1:59 AM IST

దాడి

తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఒక అగంతకుడు... మహిళపై దాడి చేసి గొంతు కోశాడు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురంలో ఈ ఘటన జరిగింది. ఇళ్ళలో పని చేసుకుంటూ ఉన్న ఓ మహిళను... అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తనతో సహజీవనం చేయాలని వేధిస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని అటువంటి వాటికి తాను ఒప్పుకోనని ఆ మహిళ తెగేసి చెప్పింది. కక్ష పెంచుకున్న నాగేశ్వరావు... ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న మహిళపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తలను పట్టుకొని కత్తితో పీక కోశాడు. బాధితురాలు గట్టిగా అరవగా... సమీపంలోని వారు వచ్చి నిందితుడిని అడ్డుకున్నారు. అప్పటికే మెడపై గాయంతో తీవ్ర రక్తస్రావంతో మహిళ రోడ్డుపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కోరిక తీర్చలేదని పీక కోశాడు

తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఒక అగంతకుడు... మహిళపై దాడి చేసి గొంతు కోశాడు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురంలో ఈ ఘటన జరిగింది. ఇళ్ళలో పని చేసుకుంటూ ఉన్న ఓ మహిళను... అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తనతో సహజీవనం చేయాలని వేధిస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని అటువంటి వాటికి తాను ఒప్పుకోనని ఆ మహిళ తెగేసి చెప్పింది. కక్ష పెంచుకున్న నాగేశ్వరావు... ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న మహిళపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తలను పట్టుకొని కత్తితో పీక కోశాడు. బాధితురాలు గట్టిగా అరవగా... సమీపంలోని వారు వచ్చి నిందితుడిని అడ్డుకున్నారు. అప్పటికే మెడపై గాయంతో తీవ్ర రక్తస్రావంతో మహిళ రోడ్డుపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కోరిక తీర్చలేదని పీక కోశాడు

ఇది కూడా చదవండి

విభజన సమస్యల పరిష్కారం కోసం వినాయకునికి వినతిపత్రం

Intro:AP_VSP_58_05_UNIT REPAIR COMPLETED BYTE_AV_AP10153Body:
ఉత్తరాంద్రలో ప్రముఖ జ‌ల‌విద్యుత్కేంద్రంగా పేరుగాంచిన సీలేరులో పదిరోజులు క్రితం మరమ్మతులకు గురైన మూడో యూనిట్ ద్వార విద్యుదుత్పత్తిని గురువారం ఉదయం నుంచి ప్రారంబించారు. దీంతో అధికారులు యూనిట్‌ నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేశారు. . సీలేరులో 240 మెగావాట్లు సామ‌ర్థ్యం గ‌ల నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇందులో స్వదేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన మూడో యూనిట్ లో పదిరోజులు క్రితం సాంకేతిక లోపం తలెత్తింది. యూనిట్‌లోని ట్రస్ట్‌ బేరింగ్‌ ఆయిల్‌ కూలర్‌కు రంద్రం పడింది. దీంతో సాంకేతిక సమస్య వచ్చి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అధికారులు హుటాహుటిన వచ్చి సాంకేతిక సమస్యను గుర్తించి దానిని సరిచేసే ప్రయత్నం ప్రారంబించారు. దీనికి తోడు గత కొన్నాళ్లుగా ట్రస్ట్‌ బేరింగ్‌ కూలింగ్‌ వాటర్‌ పైప్‌ లైన్‌ కూడా లీకేజీలు వస్తుండటంతో దీనిని కూడా అధికారులు సరిచేసే ప్రయత్నం చేసారు. . స్థానికంగా ఉన్న గుత్తేదారులతో సాంకేతిక సమస్యలను సరిచేసారు. బుధవారం సాయంత్రం నాటికి యూనిట్‌ మరమ్మతులు పూర్తికావడంతో బుధవారం రాత్రి యూనిట్‌ను స్పిన్నింగ్‌లో పెట్టారు. గురువారం ఉదయం మూడవ యూనిట్‌ ద్వారా మొదట 20 మెగావాట్లు , తరువాత 40 మెగావాట్లు వేసి గురువారం సాయంత్రం నాటికి పూర్తి లోడ్‌ వేశారు.
Conclusion:Byte:K MALLESWARA PRASAD, EE,APGENCO
Last Updated : Sep 6, 2019, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.