ETV Bharat / state

పటిష్టంగా లాక్ డౌన్.. అనుక్షణం పోలీసులు అటెన్షన్ - lock down andhrapradesh due to corona updates

దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించిన ప్రధాని మోదీ పిలుపు మేరకు.. కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పటిష్టంగా లాక్​డౌన్​ను అమలుపరుస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్​ చేస్తున్నారు.

lock down krishna dst police implimenting strict rules
కృష్ణాజిల్లాలో పటిష్టంగా అమలుపరుస్తున్న లాక్​డౌన్​
author img

By

Published : Mar 25, 2020, 3:52 PM IST

కృష్ణా జిల్లాలో పటిష్టంగా లాక్​డౌన్​

కృష్ణాజిల్లా మైలవరంలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలుపరుస్తున్నారు. రద్దీగా ఉండే రైతు బజార్​ను పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. తెరిచిన దుకాణాలను దగ్గరుండి మూసివేయించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి శానిటైజర్​ ఇస్తున్నారు.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో మూసివేశారు. నిన్నటి వరకు దేశీయ ప్రజా రవాణా విమానాలు ఐదు సర్వీసులు నడపగా అర్ధరాత్రి నుంచి వాటినీ నిలిపేశారు.

విజయవాడ నిర్మానుష్యంగా మారింది. నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, అంతర్గత రహదారులకు అడ్డంగా బారికేడ్స్ వేసి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలకు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రహదారులపై సంచరించేందుకు యత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు... లాఠీలకు పని చెబుతున్నారు.

విజయవాడ నగర శివారు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలతో రద్దీ పూర్తీ స్థాయిలో తగ్గిపోయింది. విజయవాడ పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లోని వాంబేకాలనీ, ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. నున్న గ్రామీణ పోలీసులు.. నగర శివారులోని వివిధ కాలనీల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

కృష్ణా జిల్లా గుడివాడలో లాక్​డౌన్ అమలు తీరును జిల్లా ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షించారు. స్థానిక పోలీసులతో కలిసి పట్టణంలో రహదారులను పరిశీలించారు.

ఇదీ చూడండి:

కుటుంబంతో రోడ్డెక్కిన వ్యక్తికి.. పోలీసుల 'మర్యాద'!

కృష్ణా జిల్లాలో పటిష్టంగా లాక్​డౌన్​

కృష్ణాజిల్లా మైలవరంలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలుపరుస్తున్నారు. రద్దీగా ఉండే రైతు బజార్​ను పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. తెరిచిన దుకాణాలను దగ్గరుండి మూసివేయించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి శానిటైజర్​ ఇస్తున్నారు.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో మూసివేశారు. నిన్నటి వరకు దేశీయ ప్రజా రవాణా విమానాలు ఐదు సర్వీసులు నడపగా అర్ధరాత్రి నుంచి వాటినీ నిలిపేశారు.

విజయవాడ నిర్మానుష్యంగా మారింది. నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, అంతర్గత రహదారులకు అడ్డంగా బారికేడ్స్ వేసి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలకు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రహదారులపై సంచరించేందుకు యత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు... లాఠీలకు పని చెబుతున్నారు.

విజయవాడ నగర శివారు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలతో రద్దీ పూర్తీ స్థాయిలో తగ్గిపోయింది. విజయవాడ పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లోని వాంబేకాలనీ, ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. నున్న గ్రామీణ పోలీసులు.. నగర శివారులోని వివిధ కాలనీల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

కృష్ణా జిల్లా గుడివాడలో లాక్​డౌన్ అమలు తీరును జిల్లా ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షించారు. స్థానిక పోలీసులతో కలిసి పట్టణంలో రహదారులను పరిశీలించారు.

ఇదీ చూడండి:

కుటుంబంతో రోడ్డెక్కిన వ్యక్తికి.. పోలీసుల 'మర్యాద'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.