ETV Bharat / state

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Feb 12, 2021, 2:54 PM IST

రేపు రాష్ట్రంలో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలో అధికారులు రేపు జరగబోయే పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. రెండో దఫా పంచాయతీ జరిగే ప్రాంతాల్లో గురువారం రాత్రితో ఎన్నికల ప్రచారం ముగిసింది.

local body elections
local body elections

కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో విడత ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. గుడివాడ నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 1968 వార్డులు ఉండగా 940 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 1025 వార్డులకే ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో మూడు వార్డులకు నామపత్రాలు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ డివిజన్‌లో 211 పంచాయతీల్లో 36 ఏకగ్రీవం అయ్యాయి. 34 పంచాయతీల్లో పూర్తిగా సర్పంచి పదవులు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం విశేషం. ఈ 34 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండా పోయింది. దీంతో పోలింగ్‌ కేంద్రాలు తగ్గనున్నాయి. ఈనెల 13న (శనివారం) ఈ డివిజనులోని పంచాయతీలకు పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 6.30గంటల నుంచి 3.30గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అనంతరం లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచి ఎన్నిక ఉంటాయి.

రెండు పంచాయతీల్లో..

ఈ డివిజనులో రెండు పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. 10వేల జనాభా దాటిన పంచాయతీలు కైకలూరు, పామర్రు ఉన్నాయి. రెండూ నియోజకవర్గ కేంద్రాలు కావడం విశేషం. రెండింటిలోనూ పోరు ఆసక్తికరంగా మారింది. కైకలూరులో 21292 (2011 ప్రకారం) జనాభా ఉన్నారు. ఓటర్లు 2019 ప్రకారం 15,245 మంది ఉన్నారు. ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు బలపర్చిన అభ్యర్థినిగా నవరత్న కుమారి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా కారె రాజారాణి పోటీలో ఉన్నారు. ప్రచారం హోరాహోరీగా సాగింది. రెండు వర్గాల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. మరో ప్రధాన పంచాయతీ పామర్రు. ఇది కూడా నియోజకవర్గ కేంద్రం. దీన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ బలపర్చి మద్దతు ఇచ్చిన అభ్యర్థిగా కస్తూరి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా శీలం పెద్దంట్లమ్మ పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్థానికంగా లేరు. ఆమె క్రియాశీలకంగా లేరు. మండల స్థాయి శ్రేణులు పాల్గొంటున్నాయి. ఈ రెండు పంచాయతీల్లో ఉత్కంఠ రేపుతోంది.

కొల్లేరు ప్రభావం..!

రెండో విడత పల్లెపోరులో గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలు పూర్తిగా, పామర్రు పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 9 మండలాలు. కొల్లేరు సరస్సు ప్రభావం ఎక్కువగా ఉంది. చేపలచెరువు, రొయ్యల గుంటల వ్యాపారులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. మండవల్లి, కైకలూరు మండలాల్లో ఇది కనిపిస్తోంది. మండవల్లి మండలం చింతపాడు పంచాయతీ ప్రత్యర్థులకు ప్రతిష్ఠాత్మకంగా తయారైంది. ఇక్కడ ఓటుకు రూ.5వేల వరకు పంపిణీకి సిద్ధమయ్యారు. కేవలం 1191 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో నువ్వానేనా అన్నట్లు పోరు ఉంది. రూ.కోటి వరకు ఖర్చుకు వెనకాడేది లేదని మద్దతుదారులు చెప్పుకొంటున్నారు. ఇది బీసీ మహిళకు కేటాయించారు. మరో పంచాయతీ ఇంగిలిపాకలంకలోనూ రూ.50లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది బీసీ మహిళకే రిజర్వు అయింది. కేవలం 1048 ఓట్లు ఉన్నాయి. కైకలూరు మండలం దొడ్డిపట్ల పంచాయతీలోనూ రూ.5వేల వరకు ఇస్తామని హామీ ఇస్తున్నారు. 1263 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గుడివాడ నియోజక వర్గంలో ఎక్కువ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

నేటితో ఉపసంహరణ!

మూడో విడత జరిగే బందరు డివిజనులోని పంచాయతీలకు శుక్రవారం నాటితో ఉపసంహరణ గడువు ముగుస్తోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజనులో ఏకగ్రీవాలకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందరు, పెడన, అవనిగడ్డ పూర్తిగా, పామర్రు నియోజకవర్గంలో పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే ఏకగ్రీవాల కోసం తీవ్ర హెచ్చరికలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రత్యర్థులను నిలబెట్టి మద్దతు ఇచ్చినా.. గెలిపించినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావంటూ హెచ్చరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉపసంహరణతో ఒక రూపు రానున్నాయి. మూడో విడత జరిగే ఎన్నికల్లో అవనిగడ్డ, చల్లపల్లి, లక్ష్మీపురం కోడూరు పంచాయతీలు 10వేల జనాభా పైన ఉన్నాయి. మూడో విడత పోలింగ్‌ 17న జరగనుంది.

భారీగా నామినేషన్లు!

నాలుగో విడత, చివరి పోలింగ్‌ ఈ నెల 21న జరగనున్నాయి. నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లో 288 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. 2990 వార్డులు ఉన్నాయి. తిరువూరు, నూజివీడు, గన్నవరం, మైలవరం, పామర్రు నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి.

ప్రలోభాల వల

పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో నేతలంతా సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. అధికారంగా రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. వాటి ప్రభావం అనేక చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో నియోజకవర్గ పెద్దల జోక్యం తప్పలేదు. అభ్యర్థులంతా మధ్యాహ్నానికే ప్రచారాన్ని పక్కన పెట్టి బుజ్జగింపులు, ప్రలోభాలకు తెరతీశారు. పల్లె రాజకీయం మరింత వేడెక్కుతోంది.

తిరుగుబాట్ల నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీ జరుగనుంది. వీటిలో సుమారు 25 చోట్ల అధికార పక్షానికి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని నాయకులు ఎంత బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. మండవల్లి, కానుకొల్లు, చింతపాడు, కొవ్వాడలంక, లోకుమూడి, పెరికెగూడెం, విజరం, గోపవరం, వడాలి, వణుదుర్రు, శ్రీహరిపురం, అల్లూరులో ప్రధాన పక్షానికి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో కొనసాగుతున్నారు. శీతనపల్లిలో మరో పక్షానికి చెందిన తిరుగుబాటుదారులు పోటీపడుతున్నారు. రెబల్స్‌ ధాటికి ఓటర్ల నాడిని పట్టడం అసలైన అభ్యర్థులకు కష్టంగా మారుతోంది.

ప్రలోభాలకు సై..

ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. మందుబాబులకు మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లను అందిస్తున్నారు. నాయకుల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకూ పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం. వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు అదనంగా మరికొంత కలుపుతున్నారని తెలిసింది. చీరలు, వెండి కుంకుమ భరిణెలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు తమ కదలికలను మార్చుకుంటూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకూ తటస్థంగా ఉన్నవాళ్లు ఆకసిక్మంగా తెరపైకి రావడం, హడావుడి చేసినవాళ్లు ఇంటికే పరిమితం కావడం వంటివి ఆయా వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి.

వ్యూహాలకు పదును

జిల్లాలోని మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన పంచాయతీల్లో ఫలితాలు తేలిపోయాయి. గెలుపోటములపై ఆయా రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. మలి దశ ఎన్నికల్లో మరింత లబ్ధిపొందాలన్న లక్ష్యంతో ఎవరి వ్యూహాలకు వారు పదనుపెట్టారు. కొందరు నాయకులు ఓటర్లతో పాటు తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థికి పోటీగా నామపత్రాలు వేస్తున్న వారిని బెదిరిస్తున్నారన్న ప్రచారం ముమ్మరం అవుతోంది. ఓటర్లు మాత్రం నర్మగర్భంగా వ్యవహరిస్తుండటం విశేషం.

మచిలీపట్నం డివిజన్‌ పరిధిలో 225 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులకు 1,147 మంది నామపత్రాలు సమర్పించారు. నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో 78 నామపత్రాలు తిరస్కరించారు. తిరస్కరణ విషయంలో సహేతుకమైన వివరణ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న కారణంతో మొవ్వ, భోగిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన అభ్యర్థులు ఆర్డీవో వద్ధ అప్పీలు చేశారు. మిగిలిన వారు ఆర్వోలు తెలిపిన అభ్యంతరాలు, స్థానిక పరిస్థితులను బట్టి అప్పీల్‌కు కూడా రాలేదు. వినికిడి లోపం ఉంటే పోటీ చేయకూడదన్న కారణంతో తన నామపత్రం తిరస్కరించారని, మూగ, చెవుడు ఉంటేనే పోటీకి అనర్హులన్న నిబంధన ఉందని చెప్పించినా ఉద్దేశపూర్వకంగా తన నామపత్రం తిరస్కరించారని మొవ్వకు చెందిన అభ్యర్థి, ఆ నిబంధనను ఆర్డీవోకు సమర్పించారు. భోగిరెడ్డిపల్లి అభ్యర్థి తన నామపత్రంలో ఆస్తులను ఉదహరిస్తూ అందులో తనకున్న ట్రాక్టర్‌ ఉన్నట్టు తెలియచేసినా, దాని విలువ ఎంతో నమోదు చేయలేదన్న కారణంతో అతని నామపత్రాన్ని తిరస్కరించడంతో ఆర్డీవోను ఆశ్రయించారు. రెబల్స్‌గానే పోటీలో దిగాలనుకున్న వారిపై మిగిలిన అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. ఆయా అభ్యర్థులపై పాతకేసులు, అప్పులు ఉంటే వాటిని తిరగదోడటం, భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చరించడం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, బెదిరింపులకు భయపడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ప్రతిపక్ష మద్దతుదారులైన అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తున్నారు.

పరస్పర ఆరోపణలు

ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు నియోజక వర్గాల్లోని ప్రధాన పంచాయతీల్లో అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బందరు మండలం పొట్లపాలెంలో వైకాపా మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థిని బెదింరించారన్న ఫిర్యాదుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మండల పరిధిలోని 25 గ్రామాల్లో తమ పక్షానికి చెందిన అభ్యర్థులతో పాటు ఓటర్లను మంత్రి పేర్ని నాని బెదిరిస్తున్నారని, దానికి లొంగకపోతే ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ తాజాగా ఆరోపించిన మాజీ మంత్రి రవీంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.బంధుత్వాలు, కులాలు, మతాలు, తదితరాలను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం ఆరాటపడుతున్నారు.

పోలింగ్‌కు పక్కా ఏర్పాట్లు..

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వీసీలో ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావుకు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని నియమించామన్నారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు తగు అవగాహన కల్పిస్తున్నారనీ, ఫ్లాగ్‌ మార్చ్‌, అవగాహన సదస్సులతో ఓటర్లను చైతన్యపరుస్తున్నట్టు తెలిపారు. అందరి కృషి మొదటి విడత ఎన్నికల నిర్వహించిన విజయవాడ డివిజన్‌ తరహాలోనే మిగిలిన అన్ని డివిజన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. డీఐజీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి

బందరు డివిజన్‌ పరిధిలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి సూచించారు. తాలూకా పోలీస్‌ కార్యాలయంలో సబ్‌డివిజన్‌ పరిధిలోని సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !

కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో విడత ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. గుడివాడ నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 1968 వార్డులు ఉండగా 940 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 1025 వార్డులకే ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో మూడు వార్డులకు నామపత్రాలు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ డివిజన్‌లో 211 పంచాయతీల్లో 36 ఏకగ్రీవం అయ్యాయి. 34 పంచాయతీల్లో పూర్తిగా సర్పంచి పదవులు, వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం విశేషం. ఈ 34 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అవసరం లేకుండా పోయింది. దీంతో పోలింగ్‌ కేంద్రాలు తగ్గనున్నాయి. ఈనెల 13న (శనివారం) ఈ డివిజనులోని పంచాయతీలకు పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 6.30గంటల నుంచి 3.30గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అనంతరం లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచి ఎన్నిక ఉంటాయి.

రెండు పంచాయతీల్లో..

ఈ డివిజనులో రెండు పంచాయతీల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. 10వేల జనాభా దాటిన పంచాయతీలు కైకలూరు, పామర్రు ఉన్నాయి. రెండూ నియోజకవర్గ కేంద్రాలు కావడం విశేషం. రెండింటిలోనూ పోరు ఆసక్తికరంగా మారింది. కైకలూరులో 21292 (2011 ప్రకారం) జనాభా ఉన్నారు. ఓటర్లు 2019 ప్రకారం 15,245 మంది ఉన్నారు. ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు బలపర్చిన అభ్యర్థినిగా నవరత్న కుమారి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా కారె రాజారాణి పోటీలో ఉన్నారు. ప్రచారం హోరాహోరీగా సాగింది. రెండు వర్గాల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. మరో ప్రధాన పంచాయతీ పామర్రు. ఇది కూడా నియోజకవర్గ కేంద్రం. దీన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ బలపర్చి మద్దతు ఇచ్చిన అభ్యర్థిగా కస్తూరి పోటీలో ఉన్నారు. ప్రత్యర్థిగా శీలం పెద్దంట్లమ్మ పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్థానికంగా లేరు. ఆమె క్రియాశీలకంగా లేరు. మండల స్థాయి శ్రేణులు పాల్గొంటున్నాయి. ఈ రెండు పంచాయతీల్లో ఉత్కంఠ రేపుతోంది.

కొల్లేరు ప్రభావం..!

రెండో విడత పల్లెపోరులో గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలు పూర్తిగా, పామర్రు పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 9 మండలాలు. కొల్లేరు సరస్సు ప్రభావం ఎక్కువగా ఉంది. చేపలచెరువు, రొయ్యల గుంటల వ్యాపారులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. మండవల్లి, కైకలూరు మండలాల్లో ఇది కనిపిస్తోంది. మండవల్లి మండలం చింతపాడు పంచాయతీ ప్రత్యర్థులకు ప్రతిష్ఠాత్మకంగా తయారైంది. ఇక్కడ ఓటుకు రూ.5వేల వరకు పంపిణీకి సిద్ధమయ్యారు. కేవలం 1191 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో నువ్వానేనా అన్నట్లు పోరు ఉంది. రూ.కోటి వరకు ఖర్చుకు వెనకాడేది లేదని మద్దతుదారులు చెప్పుకొంటున్నారు. ఇది బీసీ మహిళకు కేటాయించారు. మరో పంచాయతీ ఇంగిలిపాకలంకలోనూ రూ.50లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది బీసీ మహిళకే రిజర్వు అయింది. కేవలం 1048 ఓట్లు ఉన్నాయి. కైకలూరు మండలం దొడ్డిపట్ల పంచాయతీలోనూ రూ.5వేల వరకు ఇస్తామని హామీ ఇస్తున్నారు. 1263 ఓట్లు మాత్రమే ఉన్నాయి. గుడివాడ నియోజక వర్గంలో ఎక్కువ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

నేటితో ఉపసంహరణ!

మూడో విడత జరిగే బందరు డివిజనులోని పంచాయతీలకు శుక్రవారం నాటితో ఉపసంహరణ గడువు ముగుస్తోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ డివిజనులో ఏకగ్రీవాలకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందరు, పెడన, అవనిగడ్డ పూర్తిగా, పామర్రు నియోజకవర్గంలో పాక్షికంగా ఎన్నికలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే ఏకగ్రీవాల కోసం తీవ్ర హెచ్చరికలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రత్యర్థులను నిలబెట్టి మద్దతు ఇచ్చినా.. గెలిపించినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావంటూ హెచ్చరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉపసంహరణతో ఒక రూపు రానున్నాయి. మూడో విడత జరిగే ఎన్నికల్లో అవనిగడ్డ, చల్లపల్లి, లక్ష్మీపురం కోడూరు పంచాయతీలు 10వేల జనాభా పైన ఉన్నాయి. మూడో విడత పోలింగ్‌ 17న జరగనుంది.

భారీగా నామినేషన్లు!

నాలుగో విడత, చివరి పోలింగ్‌ ఈ నెల 21న జరగనున్నాయి. నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లో 288 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. 2990 వార్డులు ఉన్నాయి. తిరువూరు, నూజివీడు, గన్నవరం, మైలవరం, పామర్రు నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి.

ప్రలోభాల వల

పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో నేతలంతా సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. అధికారంగా రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. వాటి ప్రభావం అనేక చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో నియోజకవర్గ పెద్దల జోక్యం తప్పలేదు. అభ్యర్థులంతా మధ్యాహ్నానికే ప్రచారాన్ని పక్కన పెట్టి బుజ్జగింపులు, ప్రలోభాలకు తెరతీశారు. పల్లె రాజకీయం మరింత వేడెక్కుతోంది.

తిరుగుబాట్ల నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీ జరుగనుంది. వీటిలో సుమారు 25 చోట్ల అధికార పక్షానికి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని నాయకులు ఎంత బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. మండవల్లి, కానుకొల్లు, చింతపాడు, కొవ్వాడలంక, లోకుమూడి, పెరికెగూడెం, విజరం, గోపవరం, వడాలి, వణుదుర్రు, శ్రీహరిపురం, అల్లూరులో ప్రధాన పక్షానికి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో కొనసాగుతున్నారు. శీతనపల్లిలో మరో పక్షానికి చెందిన తిరుగుబాటుదారులు పోటీపడుతున్నారు. రెబల్స్‌ ధాటికి ఓటర్ల నాడిని పట్టడం అసలైన అభ్యర్థులకు కష్టంగా మారుతోంది.

ప్రలోభాలకు సై..

ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. మందుబాబులకు మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లను అందిస్తున్నారు. నాయకుల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకూ పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం. వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు అదనంగా మరికొంత కలుపుతున్నారని తెలిసింది. చీరలు, వెండి కుంకుమ భరిణెలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు తమ కదలికలను మార్చుకుంటూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకూ తటస్థంగా ఉన్నవాళ్లు ఆకసిక్మంగా తెరపైకి రావడం, హడావుడి చేసినవాళ్లు ఇంటికే పరిమితం కావడం వంటివి ఆయా వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి.

వ్యూహాలకు పదును

జిల్లాలోని మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన పంచాయతీల్లో ఫలితాలు తేలిపోయాయి. గెలుపోటములపై ఆయా రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. మలి దశ ఎన్నికల్లో మరింత లబ్ధిపొందాలన్న లక్ష్యంతో ఎవరి వ్యూహాలకు వారు పదనుపెట్టారు. కొందరు నాయకులు ఓటర్లతో పాటు తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థికి పోటీగా నామపత్రాలు వేస్తున్న వారిని బెదిరిస్తున్నారన్న ప్రచారం ముమ్మరం అవుతోంది. ఓటర్లు మాత్రం నర్మగర్భంగా వ్యవహరిస్తుండటం విశేషం.

మచిలీపట్నం డివిజన్‌ పరిధిలో 225 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులకు 1,147 మంది నామపత్రాలు సమర్పించారు. నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో 78 నామపత్రాలు తిరస్కరించారు. తిరస్కరణ విషయంలో సహేతుకమైన వివరణ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న కారణంతో మొవ్వ, భోగిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన అభ్యర్థులు ఆర్డీవో వద్ధ అప్పీలు చేశారు. మిగిలిన వారు ఆర్వోలు తెలిపిన అభ్యంతరాలు, స్థానిక పరిస్థితులను బట్టి అప్పీల్‌కు కూడా రాలేదు. వినికిడి లోపం ఉంటే పోటీ చేయకూడదన్న కారణంతో తన నామపత్రం తిరస్కరించారని, మూగ, చెవుడు ఉంటేనే పోటీకి అనర్హులన్న నిబంధన ఉందని చెప్పించినా ఉద్దేశపూర్వకంగా తన నామపత్రం తిరస్కరించారని మొవ్వకు చెందిన అభ్యర్థి, ఆ నిబంధనను ఆర్డీవోకు సమర్పించారు. భోగిరెడ్డిపల్లి అభ్యర్థి తన నామపత్రంలో ఆస్తులను ఉదహరిస్తూ అందులో తనకున్న ట్రాక్టర్‌ ఉన్నట్టు తెలియచేసినా, దాని విలువ ఎంతో నమోదు చేయలేదన్న కారణంతో అతని నామపత్రాన్ని తిరస్కరించడంతో ఆర్డీవోను ఆశ్రయించారు. రెబల్స్‌గానే పోటీలో దిగాలనుకున్న వారిపై మిగిలిన అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. ఆయా అభ్యర్థులపై పాతకేసులు, అప్పులు ఉంటే వాటిని తిరగదోడటం, భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చరించడం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, బెదిరింపులకు భయపడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ప్రతిపక్ష మద్దతుదారులైన అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తున్నారు.

పరస్పర ఆరోపణలు

ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు నియోజక వర్గాల్లోని ప్రధాన పంచాయతీల్లో అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బందరు మండలం పొట్లపాలెంలో వైకాపా మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థిని బెదింరించారన్న ఫిర్యాదుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మండల పరిధిలోని 25 గ్రామాల్లో తమ పక్షానికి చెందిన అభ్యర్థులతో పాటు ఓటర్లను మంత్రి పేర్ని నాని బెదిరిస్తున్నారని, దానికి లొంగకపోతే ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ తాజాగా ఆరోపించిన మాజీ మంత్రి రవీంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.బంధుత్వాలు, కులాలు, మతాలు, తదితరాలను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం ఆరాటపడుతున్నారు.

పోలింగ్‌కు పక్కా ఏర్పాట్లు..

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వీసీలో ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావుకు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని నియమించామన్నారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు తగు అవగాహన కల్పిస్తున్నారనీ, ఫ్లాగ్‌ మార్చ్‌, అవగాహన సదస్సులతో ఓటర్లను చైతన్యపరుస్తున్నట్టు తెలిపారు. అందరి కృషి మొదటి విడత ఎన్నికల నిర్వహించిన విజయవాడ డివిజన్‌ తరహాలోనే మిగిలిన అన్ని డివిజన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. డీఐజీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి

బందరు డివిజన్‌ పరిధిలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి సూచించారు. తాలూకా పోలీస్‌ కార్యాలయంలో సబ్‌డివిజన్‌ పరిధిలోని సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.