ETV Bharat / state

అవినీతి రహిత పాలనకు పునరంకితం: సీఎం జగన్

దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక చట్టాలు తీసుకొచ్చామని సీఎం జగన్​ అన్నారు. అవినీతి రహిత పాలనకు పునరంకితమవుతామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక్లలో ఆయన పాల్గొని మాట్లాడారు.

author img

By

Published : Aug 15, 2019, 1:35 PM IST

Updated : Aug 15, 2019, 2:49 PM IST

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందుకు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాక ఆవిష్కరణ అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు.

సామాజిక న్యాయ చరిత్రలోనే లేనివిధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని... జాతీయ జెండా ఆవిష్కరించారు. అవినీతి రూపుమాపేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని జగన్​ స్పష్టం చేశారు. గ్రామాన్ని మార్చేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చామని... రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసినట్లు తెలిపారు.

వచ్చే బడ్జెట్​ అక్కచెల్లెమ్మలకు..

వచ్చే బడ్జెట్‌ను అక్కచెల్లెమ్మలకు అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రక్షా బంధన్‌ సందర్భంగా నాలుగు దఫాల్లో 27 వేల147 కోట్ల రూపాయలను పొదుపు సంఘాలకు ఇస్తామని తెలిపారు. మహిళల కోసం వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూతను తీసుకొస్తున్నామని చెప్పారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారికి వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు.

ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి..

గోదావరి జలాలను సాగర్‌, శ్రీశైలానికి తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

టెండరింగ్​లో అవినీతి ఉండదు...

దేశచరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానాలకు శ్రీకారం చుట్టామని జగన్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నామని, టెండర్‌ పనుల ఖరారు ప్రక్రియ హైకోర్టు జడ్జి ముందు పెడుతున్నామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కోటి రూపాయలు దాటిన ఏ కొనుగోళ్లయినా పారదర్శకత పాటించేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందిస్తున్నామని వివరించారు.

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం

ఇదీ చదవండి

సైకత శిల్పంతో భారతావనికి రక్షా బంధన్​

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందుకు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాక ఆవిష్కరణ అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు.

సామాజిక న్యాయ చరిత్రలోనే లేనివిధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని... జాతీయ జెండా ఆవిష్కరించారు. అవినీతి రూపుమాపేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని జగన్​ స్పష్టం చేశారు. గ్రామాన్ని మార్చేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చామని... రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసినట్లు తెలిపారు.

వచ్చే బడ్జెట్​ అక్కచెల్లెమ్మలకు..

వచ్చే బడ్జెట్‌ను అక్కచెల్లెమ్మలకు అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రక్షా బంధన్‌ సందర్భంగా నాలుగు దఫాల్లో 27 వేల147 కోట్ల రూపాయలను పొదుపు సంఘాలకు ఇస్తామని తెలిపారు. మహిళల కోసం వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూతను తీసుకొస్తున్నామని చెప్పారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారికి వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు.

ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి..

గోదావరి జలాలను సాగర్‌, శ్రీశైలానికి తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

టెండరింగ్​లో అవినీతి ఉండదు...

దేశచరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానాలకు శ్రీకారం చుట్టామని జగన్ అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నామని, టెండర్‌ పనుల ఖరారు ప్రక్రియ హైకోర్టు జడ్జి ముందు పెడుతున్నామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కోటి రూపాయలు దాటిన ఏ కొనుగోళ్లయినా పారదర్శకత పాటించేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందిస్తున్నామని వివరించారు.

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం

ఇదీ చదవండి

సైకత శిల్పంతో భారతావనికి రక్షా బంధన్​

Intro:Ap_atp_61_15_long_flag_av_ap10005
~~~~~~~~~~~~~~*
ముప్పావు కిలో మీటర్ జాతీయ పతాకం ప్రదర్శన.....
~~~~~~~~~~~~"*
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో 730 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. పట్టణంలో ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయా శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు.. స్థానిక వివేకానంద విద్యా సంస్థలకు యాజమాన్యం చిన్నారులచే తమ విద్యాసంస్థల్లో తయారుచేసిన 730 మీటర్ల పొడవున్న జాతీయపతాకాన్ని పట్టణంలోని అన్ని ప్రధాన విధుల్లో ప్రదర్శించడంతో ఈ జాతీయ పతాకాన్ని చూడటానికి పట్టణవాసులు ఆసక్తిBody:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion: కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Aug 15, 2019, 2:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.