ETV Bharat / state

ఎంఎస్​ఎంఈలకు ప్యాకేజీపై స్పష్టత లేదు: గౌతమ్​రెడ్డి

author img

By

Published : May 14, 2020, 6:08 PM IST

ఎంఎస్​ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్)కు కేంద్రం ఏ ప్రాతిపదికన ప్యాకేజీ ప్రకటించిందనీ.. స్పష్టత లేదని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పాత రుణాలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందా..? అన్నది తేలాల్సి ఉందన్నారు. కొత్త రుణాలను పూచీకత్తు లేకుండా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

it minister goutham reddy speaks on msme package
ఎంఎస్​ఎంఈలకు ప్యాకేజీపై స్పష్టత లేదన్న మంత్రి గౌతంరెడ్డి

ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని మంత్రి గౌతమ్​రెడ్డి అన్నారు. ఏపీలోని 97 వేల ఎంఎస్ఎంఈలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాయని.. కేటాయించిన రూ.907 కోట్లు ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని మంత్రి తెలిపారు. ఎంస్ఎంఈల విద్యుత్ బకాయిలపై ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి చేశామన్న గౌతమ్​రెడ్డి.. రాష్ట్రంలోని హానికారక రసాయనాలను వినియోగించే 87 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆడిట్ తర్వాతే కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని మంత్రి గౌతమ్​రెడ్డి అన్నారు. ఏపీలోని 97 వేల ఎంఎస్ఎంఈలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాయని.. కేటాయించిన రూ.907 కోట్లు ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని మంత్రి తెలిపారు. ఎంస్ఎంఈల విద్యుత్ బకాయిలపై ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి చేశామన్న గౌతమ్​రెడ్డి.. రాష్ట్రంలోని హానికారక రసాయనాలను వినియోగించే 87 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆడిట్ తర్వాతే కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

'పరిశ్రమలు మూసివేయాలని ఆదేశించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.