కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన వీరంకి వెంకట రమణ మొక్కజొన్న లోడు లారీలో 142 కేసుల మద్యం తరలించాడు.
గడ్డి వాముల్లో దాచారు... పోలీసులు పట్టుకున్నారు
రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో... కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్నారు. అరుణాచల్ప్రదేశ్ నుంచి తీసుకువస్తున్న మద్యం సీసాలను కృష్ణా జిల్లా మంతెనలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![గడ్డి వాముల్లో దాచారు... పోలీసులు పట్టుకున్నారు illegal liquor seized in manthena krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7498972-1024-7498972-1591426196275.jpg?imwidth=3840)
వాటిలో కొన్నింటిని ఇతరులకు అమ్మగా... గన్నవరం మండలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో అవి బయటపడ్డాయి. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంకటరమణ గడ్డివాముల కింద దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి.. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ స్మార్ట్ ఫోన్
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన వీరంకి వెంకట రమణ మొక్కజొన్న లోడు లారీలో 142 కేసుల మద్యం తరలించాడు.
వాటిలో కొన్నింటిని ఇతరులకు అమ్మగా... గన్నవరం మండలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో అవి బయటపడ్డాయి. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంకటరమణ గడ్డివాముల కింద దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి.. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ స్మార్ట్ ఫోన్