మద్యాన్ని రకరకాల మార్గాల్లో తరలించడానికి అక్రమదారులు ప్రయత్నిస్తున్నారు. కారు డోర్ మధ్యలో బాటిల్స్ పేర్చి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నూజివీడు డీఎస్పీ బుక్క వరపు శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ రామచంద్ర రావు సూచనల మేరకు ముసునూరు ఎస్సై రాజారెడ్డి వాహన తనీఖీలు నిర్వహించారు.
సర్దార్ హుస్సేన్ మెకానిక్ కారుపై అనుమానం వచ్చి పోలీసులు తనీఖీలు చేశారు. కారు డోర్ మధ్యలో, స్టీరింగ్ ముందుభాగంలో 40 వేల రూపాయల విలువ చేసే 286 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తెలంగాణ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. వీటిని ముసునూరు గ్రామానికి చెందిన అనగాని రాంబాబు అనే వ్యక్తికి విక్రయించేందుకు వెళ్తునట్లు వివరించాడు. చాకచక్యంగా కారులో తరలిస్తున్న మద్యం సీసాలను పట్టుకున్న ముసునూరు ఎస్సై రాజారెడ్డిని, సిబ్బందిని అధికారులు అభినందించారు.
ఇవీ చదవండి