ETV Bharat / state

నిలిచిన బైపాస్ రోడ్డు పనులు... వాహనదారులకు ఇబ్బందులు

author img

By

Published : Nov 5, 2020, 3:34 PM IST

నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రహదారి పనులు నిలిచిపోయి... వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నా... ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి.

high way bypass road construction stops
నిలిచిన బైపాస్ రోడ్డు పనులు

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు పనులు పూర్తికాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై, నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు విస్తరణ పనులు 2018లో ప్రారంభించారు. దీని కోసం రూ. 360 కోట్లు మంజూరు చేశారు. నందిగామ వద్ద 7 కిలోమీటర్లు, కంచికర్ల వద్ద 7 కిలోమీటర్లు చొప్పున బైపాస్​ రోడ్డు 6 వరుసల రహదారిగా విస్తరించాల్సి ఉంది. ఈ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంది. కానీ నందిగామ సమీపంలో అంబర్​పేట అడ్డురోడ్డు వద్ద వెహికల్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మించినప్పటికీ.. దీనికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు వేసేందుకు అవసరమైన స్థలం కేటాయించలేదు. దీంతో రహదారి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

హైవే బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికాకపోవటంతో.. ప్రస్తుతం నందిగామ-కంచికర్ల మీదుగా వన్​ వే మీదుగా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. వన్​ వే కావటం.. ఎక్కువ వాహన రద్దీ ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

గత 10 నెలల కాలంలో నందిగామ వద్ద 20 ప్రమాదాలు జరగ్గా... 11 మంది మృతి చెందారు. కంచికర్ల వద్ద జరిగిన 10 ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. హైవే నిర్మాణం పూర్తైతే వాహన రద్దీ తగ్గి.. ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. హైవే బైపాస్ రోడ్డు పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'లోడ్ ఎక్కువైతే 40వేలు ఫైనా.. వైకాపాది తుగ్లక్ పాలన'

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు పనులు పూర్తికాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై, నందిగామ-కంచికర్ల వద్ద బైపాస్ రోడ్డు విస్తరణ పనులు 2018లో ప్రారంభించారు. దీని కోసం రూ. 360 కోట్లు మంజూరు చేశారు. నందిగామ వద్ద 7 కిలోమీటర్లు, కంచికర్ల వద్ద 7 కిలోమీటర్లు చొప్పున బైపాస్​ రోడ్డు 6 వరుసల రహదారిగా విస్తరించాల్సి ఉంది. ఈ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉంది. కానీ నందిగామ సమీపంలో అంబర్​పేట అడ్డురోడ్డు వద్ద వెహికల్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మించినప్పటికీ.. దీనికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు వేసేందుకు అవసరమైన స్థలం కేటాయించలేదు. దీంతో రహదారి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

హైవే బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికాకపోవటంతో.. ప్రస్తుతం నందిగామ-కంచికర్ల మీదుగా వన్​ వే మీదుగా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. వన్​ వే కావటం.. ఎక్కువ వాహన రద్దీ ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

గత 10 నెలల కాలంలో నందిగామ వద్ద 20 ప్రమాదాలు జరగ్గా... 11 మంది మృతి చెందారు. కంచికర్ల వద్ద జరిగిన 10 ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. హైవే నిర్మాణం పూర్తైతే వాహన రద్దీ తగ్గి.. ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. హైవే బైపాస్ రోడ్డు పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'లోడ్ ఎక్కువైతే 40వేలు ఫైనా.. వైకాపాది తుగ్లక్ పాలన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.