ETV Bharat / state

కౌలురైతు ఆత్మహత్యకు నిరసనగా అన్నదాతల ఆందోళన - నందిగామ ఆస్పత్రి శవాగారం ముందు రైతుల ఆందోళన

కృష్ణాజిల్లా నందిగామ సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయకపోవడం వల్లే కౌలు రైతు కట్టా లక్ష్మీ నారాయణ బలవన్మరణానికి పాల్పడ్డాడని.. రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని.. నష్టపరిహారం కింద కోటి రూపాయలు అతడి కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు.

farmers protest in nandigama
నందిగామలో రైతుల నిరసన
author img

By

Published : Jan 20, 2021, 4:23 PM IST

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని.. రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా నందిగామ ఆస్పత్రిలో పోస్ట్​మార్టం గది వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. పరిహారం ఇచ్చేవరకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నందిగామలోని సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోలు చేయకపోవడం వల్లే లక్ష్మీ నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు ఆరోపించారు. గతేడాది పండిన పత్తిని ఈ ఏడాది తీసుకోకపోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడని తెలిపారు. తక్షణమే స్థానిక ఏఎంసీలో కొనుగోళ్లు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు.

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కట్టా లక్ష్మీనారాయణ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని.. రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా నందిగామ ఆస్పత్రిలో పోస్ట్​మార్టం గది వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. పరిహారం ఇచ్చేవరకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నందిగామలోని సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోలు చేయకపోవడం వల్లే లక్ష్మీ నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు ఆరోపించారు. గతేడాది పండిన పత్తిని ఈ ఏడాది తీసుకోకపోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడని తెలిపారు. తక్షణమే స్థానిక ఏఎంసీలో కొనుగోళ్లు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: 'రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.