ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు - central govt rules on eas funds

ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మాణ పనులకు మెటీరియల్​ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేయకపోవడంపై ఉపాధి హామీ మండలి సభ్యులు గవర్నర్​ బిశ్వభూషన్​ హరిచందన్​కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.1,961 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గవర్నర్​ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు
author img

By

Published : Sep 27, 2019, 9:28 PM IST

గవర్నర్​ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మాణ పనుల మెటీరియల్‌ కోసం విడుదల చేసిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేయడంపై ఉపాధి హామీ మండలి సభ్యులు రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలిసి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.1,961 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకపోతే , భవిష్యత్​లో ఉపాధి నిధులు నిలిపివేస్తామనే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికను పరిగణలోకి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే మూడు రోజుల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు... పనులు చేసిన వారికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్​ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మాణ పనుల మెటీరియల్‌ కోసం విడుదల చేసిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేయడంపై ఉపాధి హామీ మండలి సభ్యులు రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలిసి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.1,961 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకపోతే , భవిష్యత్​లో ఉపాధి నిధులు నిలిపివేస్తామనే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికను పరిగణలోకి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే మూడు రోజుల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు... పనులు చేసిన వారికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :

మహా పోరు: శరద్​ పవార్​ రివర్స్​ గేర్​- కేంద్రంపై ఫైర్​

Intro:AP_CDP_26_27_ARDANAGNA_PRADARSHANA_AP10121


Body:వర్షాకాలం దోమల ఉధృతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు అర్ద నగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్థానికులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకులు అధికారుల తీరును నిరసించారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని గతంలో ఎన్నో మార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించకపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుర అధికారులతో వాగ్వాదం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.