ETV Bharat / state

ఈ కారు డ్రైవర్.. ఈ-బైక్​ రూపకర్త

అతను చదివింది ఆరో తరగతి. కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితేనేం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సొంతంగా విద్యుత్ వాహనం తయారు చేసి కేవలం 80 రూపాయలతోనే నెలంతా ప్రయాణిస్తున్నాడు. ప్రస్తుతం దానిపైనే విధులకు వెళ్లి వస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

author img

By

Published : Jul 17, 2019, 7:03 AM IST

ఈ బైక్
కారు డ్రైవర్... ఈ- బైక్​ను రూపొందించాడు

కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్... విద్యుత్ శాఖలో కారు చోదకునిగా పని చేస్తున్నాడు. చిన్నతనంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సెల్ ఫోన్ రిపేరులో స్వల్పకాలిక కోర్సు పూర్తి చేశాడు. గతంలో పల్సర్ బైక్ వాడే రమేష్... ఖర్చును భరించలేక తన ద్విచక్రవాహనాన్ని విక్రయించి ఈ-బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని వద్ద తగినంత నగదు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. స్వర్ణభారత్ ట్రస్టులో తీసుకున్న కోచింగ్ సాయంతో తానే సొంతంగా ఈ బైక్​ను రూపొందించాలని ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాడు.

పాడైపోయిన సైకిళ్ల విడి భాగాలు, పాత ఇనుప ఫ్రేములు, సైకిల్ చక్రాలు, బ్యాటరీలు, వాషింగ్ మెషీన్​లో వినియోగించే మోటారును వాడి రమేష్ బాబు ఈ-బైక్​ను తయారు చేశాడు. రోజూ విధులకు వెళ్లి వస్తూనే.. ఖాళీ సమయంలో బైక్​ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యేవాడు. బ్యాటరీ, కంట్రోల్ యూనిట్, కీ-బాక్స్ మినహా... మిగిలినవన్నీ రమేష్ స్థానికంగానే కొనుగోలు చేసి ఈ-బైక్​ను తయారు చేశాడు.

ప్రత్యేకతలు
ఈ-బైక్ ప్రత్యేకతల విషయానికి వస్తే....కేవలం గంటపాటు చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం అవలీలగా ప్రయాణించవచ్చు. ఇందులో అమర్చిన కీ బాక్స్ ద్వారా....ఎన్ని పాయింట్లు ఛార్జింగ్ చేశామనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చూసేందుకు సైకిల్ లా అనిపించినా....ఇద్దరిని సునాయాసంగా మోయగలిగే సామర్థ్యం ఈ-బైక్ సొంతం. దాదాపు రెండు నెలల నుంచి రమేష్ ఈ-బైక్ వాడుతున్నాడు. రెండు నెలలుగా బైక్ కోసం ఖర్చు చేసింది కేవలం 160 రూపాయలు మాత్రమే. నెల మొత్తం ఈ-బైక్ ఛార్జింగ్ ఖర్చు 80 నుంచి 100 రూపాయలు దాటకపోవడం విశేషం. అన్ని వర్గాలవారు, ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అనువుగా ఉంటుందని రమేశ్ చెబుతున్నాడు. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే... 200 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా నడిచే స్కూటీ లాంటి వాహనాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు రమేశ్. ప్రభుత్వం సాయమందిస్తే... ఇలాంటి ఈ-బైకులు మరిన్ని తయారుచేస్తానని చెబుతున్నాడు.

కారు డ్రైవర్... ఈ- బైక్​ను రూపొందించాడు

కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్... విద్యుత్ శాఖలో కారు చోదకునిగా పని చేస్తున్నాడు. చిన్నతనంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సెల్ ఫోన్ రిపేరులో స్వల్పకాలిక కోర్సు పూర్తి చేశాడు. గతంలో పల్సర్ బైక్ వాడే రమేష్... ఖర్చును భరించలేక తన ద్విచక్రవాహనాన్ని విక్రయించి ఈ-బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని వద్ద తగినంత నగదు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. స్వర్ణభారత్ ట్రస్టులో తీసుకున్న కోచింగ్ సాయంతో తానే సొంతంగా ఈ బైక్​ను రూపొందించాలని ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాడు.

పాడైపోయిన సైకిళ్ల విడి భాగాలు, పాత ఇనుప ఫ్రేములు, సైకిల్ చక్రాలు, బ్యాటరీలు, వాషింగ్ మెషీన్​లో వినియోగించే మోటారును వాడి రమేష్ బాబు ఈ-బైక్​ను తయారు చేశాడు. రోజూ విధులకు వెళ్లి వస్తూనే.. ఖాళీ సమయంలో బైక్​ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యేవాడు. బ్యాటరీ, కంట్రోల్ యూనిట్, కీ-బాక్స్ మినహా... మిగిలినవన్నీ రమేష్ స్థానికంగానే కొనుగోలు చేసి ఈ-బైక్​ను తయారు చేశాడు.

ప్రత్యేకతలు
ఈ-బైక్ ప్రత్యేకతల విషయానికి వస్తే....కేవలం గంటపాటు చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం అవలీలగా ప్రయాణించవచ్చు. ఇందులో అమర్చిన కీ బాక్స్ ద్వారా....ఎన్ని పాయింట్లు ఛార్జింగ్ చేశామనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చూసేందుకు సైకిల్ లా అనిపించినా....ఇద్దరిని సునాయాసంగా మోయగలిగే సామర్థ్యం ఈ-బైక్ సొంతం. దాదాపు రెండు నెలల నుంచి రమేష్ ఈ-బైక్ వాడుతున్నాడు. రెండు నెలలుగా బైక్ కోసం ఖర్చు చేసింది కేవలం 160 రూపాయలు మాత్రమే. నెల మొత్తం ఈ-బైక్ ఛార్జింగ్ ఖర్చు 80 నుంచి 100 రూపాయలు దాటకపోవడం విశేషం. అన్ని వర్గాలవారు, ముఖ్యంగా మహిళలకు ఇది చాలా అనువుగా ఉంటుందని రమేశ్ చెబుతున్నాడు. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే... 200 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా నడిచే స్కూటీ లాంటి వాహనాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు రమేశ్. ప్రభుత్వం సాయమందిస్తే... ఇలాంటి ఈ-బైకులు మరిన్ని తయారుచేస్తానని చెబుతున్నాడు.

Intro:ap_vzm_38_16_gurupowrnami_vedukalu_avb_vis_ap10085 గురు పౌర్ణమి వేడుకలను సాయి మందిరాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు శిరిడి సాయి మందిరంలో ఉదయం 5 గంటల నుంచే పూజలు ప్రారంభమయ్యాయి సాయి బాబాకు భక్తులు స్వహస్తాలతో పాలాభిషేకం నిర్వహించారు పట్టణంలోని బైపాస్ రోడ్ లోని శిరిడి సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు సాయి నగర్ కాలనీ వై కే యం బూరాడ వీధి సీతానగరం బలిజిపేట మండలాల్లోనూ గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు


Conclusion:బైపాస్ రోడ్డు లోని షిరిడి సాయి మందిరంలో పూజలు దర్శించుకుంటున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తున్న భక్తులు ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులు శిరిడి సాయి మందిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.