ETV Bharat / state

Donation to Journalist: దివంగత విలేకరి పితాజీ కుటుంబానికి ఆర్థిక సాయం

author img

By

Published : Jun 20, 2021, 9:23 PM IST

కరోనా బారిన పడి చనిపోయిన ఇద్దరు జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ తెలిపారు. ఈ మేరకు దివిసీమ జర్నలిస్టుల సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే సింహాద్రి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పితాజీ కుటుంబానికి రూ. 6.17 లక్షల డిపాజిట్ పత్రాలను అందించారు.

Donation to Journalist : దివంగత విలేకరి పితాజీ కుటుంబానికి రూ.6 లక్షల విరాళం
Donation to Journalist : దివంగత విలేకరి పితాజీ కుటుంబానికి రూ.6 లక్షల విరాళం

కృష్ణా జిల్లా అవనిగడ్డలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు. దివిసీమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో దివంగత విలేకరి మట్టా పితాజీ కుటుంబానికి సేకరించిన రూ.6,17,492 లక్షల విరాళాన్ని పోస్టల్ ఫిక్స్​డ్ డిపాజిట్ చేసిన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పితాజీ భార్య స్వాతి కుమారికి అందజేశారు.

25 రోజుల వ్యవధిలో..

ఇరవై ఐదు రోజుల వ్వవధిలోనే నియోజకవర్గ పరిధిలో కొవిడ్ విజృంభణతో ఇద్దరు జర్నలిస్టులను కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివిసీమ జర్నలిస్టుల ఆధ్వర్యంలో దివంగత రిపోర్టర్ నంద్యాల శ్రీనివాస్, విలేకరి మట్టా పితాజీ కుటుంబాలకు రూ. 11,73,209 లక్షలు సేకరించడం చాలా గొప్ప విషయమన్నారు. దివిసీమలో పాత్రికేయులు చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శనీయమని ఆయన వివరించారు.

కార్యక్రమంలో అవనిగడ్డ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పుట్టి శ్రీనివాసరావు, ఎంపీడీవో కేవి సుబ్బారావు, తహశీల్దారు టి. చంద్రశేఖర నాయుడు, చల్లపల్లి సీఐ శ్రీనివాసరావు, ఆరు మండలాలకు చెందిన పాత్రికేయులు, పితాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ETELA: 'ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మే'

కృష్ణా జిల్లా అవనిగడ్డలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీ ఇచ్చారు. దివిసీమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో దివంగత విలేకరి మట్టా పితాజీ కుటుంబానికి సేకరించిన రూ.6,17,492 లక్షల విరాళాన్ని పోస్టల్ ఫిక్స్​డ్ డిపాజిట్ చేసిన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పితాజీ భార్య స్వాతి కుమారికి అందజేశారు.

25 రోజుల వ్యవధిలో..

ఇరవై ఐదు రోజుల వ్వవధిలోనే నియోజకవర్గ పరిధిలో కొవిడ్ విజృంభణతో ఇద్దరు జర్నలిస్టులను కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివిసీమ జర్నలిస్టుల ఆధ్వర్యంలో దివంగత రిపోర్టర్ నంద్యాల శ్రీనివాస్, విలేకరి మట్టా పితాజీ కుటుంబాలకు రూ. 11,73,209 లక్షలు సేకరించడం చాలా గొప్ప విషయమన్నారు. దివిసీమలో పాత్రికేయులు చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శనీయమని ఆయన వివరించారు.

కార్యక్రమంలో అవనిగడ్డ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పుట్టి శ్రీనివాసరావు, ఎంపీడీవో కేవి సుబ్బారావు, తహశీల్దారు టి. చంద్రశేఖర నాయుడు, చల్లపల్లి సీఐ శ్రీనివాసరావు, ఆరు మండలాలకు చెందిన పాత్రికేయులు, పితాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ETELA: 'ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.