ETV Bharat / state

కరోనా అంతమవ్వాలని కోరుతూ... ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం

author img

By

Published : May 31, 2021, 8:38 AM IST

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి తొలగిపోయి, ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ హోమం జరిపించినట్లు ఆలయాధికారులు తెలిపారు.

Dhanvantari Maha Mrityunjaya Homam
ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం జరిపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశం మేరకు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్ పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా అంతమవ్వాలని ప్రార్థిస్తూ ఈ హోమం నిర్వహించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

కొవిడ్​ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించిన మహా మృత్యుంజయ హోమం ఆన్​లైన్​ ద్వారా వీక్షించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యూట్యూబ్​ లింకు ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా భక్తులు హోమంలో పాల్గొని, స్వామి వారి దీవెనలు పొందారని ఆలయాధికారులు తెలిపారు.

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం జరిపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశం మేరకు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ జీవీడీఎన్ లీలాకుమార్ పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా అంతమవ్వాలని ప్రార్థిస్తూ ఈ హోమం నిర్వహించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

కొవిడ్​ బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. నిర్వహించిన మహా మృత్యుంజయ హోమం ఆన్​లైన్​ ద్వారా వీక్షించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యూట్యూబ్​ లింకు ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా భక్తులు హోమంలో పాల్గొని, స్వామి వారి దీవెనలు పొందారని ఆలయాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

సింహాద్రి అప్పన్న ఆలయంలో శుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.