ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి - మైలవరంలో దీక్ష విరమింపచేసిన దేవినేని ఉమ
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి నిరసనలపై ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు వివరణ కోరిందనీ, ఇటువంటి సంఘటనలు చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.