ETV Bharat / state

"వరదొచ్చినా.. మేము ఇక్కడినుంచి కదిలేది లేదు"

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని....బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రవాహం అంతకంతకూ పెరుగుతుతుండటంతో....నదీ పరీవాహకంలోని నివాసాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయినప్పటికీ కొంతమంది పునరాస కేంద్రాలకు వెళ్లటం లేదు. కరకట్టనే ఆవాసంగా మార్చుకున్నారు.

author img

By

Published : Aug 17, 2019, 1:10 PM IST

కరకట్ట
బాధితుల ఆవేదన

విజయవాడలోని కృష్ణలంక తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్, గీతానగర్​లోని చాలా ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే చాలామంది ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లగా.... చాలామంది విలువైన సామాన్లు ఎమైపోతాయోనని కట్టుబట్టలతో కరకట్టపై ఉంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, రాణిగారితోటలోని కమ్యూనిటీ భవనంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా...వాటిలో ఎక్కువమంది ఉండేందుకు వీలు లేకపోవడంతోనూ చాలామంది కరకట్టపై ఉంటున్నారు. తడిచిన బట్టలు, వస్తువులను ఆరబెట్టుకుంటూ... మరోవైపు వరద ప్రవాహం ఎక్కడ పెరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారే తప్ప ఏమీ చేయడం లేదని....సరఫరా చేసే ఆహారం కూడా బాగోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గీతానగర్ వరకు ఉన్న రక్షణ గోడను... పొడిగించి తమను ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.

బాధితుల ఆవేదన

విజయవాడలోని కృష్ణలంక తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్, గీతానగర్​లోని చాలా ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే చాలామంది ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లగా.... చాలామంది విలువైన సామాన్లు ఎమైపోతాయోనని కట్టుబట్టలతో కరకట్టపై ఉంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం, రాణిగారితోటలోని కమ్యూనిటీ భవనంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా...వాటిలో ఎక్కువమంది ఉండేందుకు వీలు లేకపోవడంతోనూ చాలామంది కరకట్టపై ఉంటున్నారు. తడిచిన బట్టలు, వస్తువులను ఆరబెట్టుకుంటూ... మరోవైపు వరద ప్రవాహం ఎక్కడ పెరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూస్తున్నారే తప్ప ఏమీ చేయడం లేదని....సరఫరా చేసే ఆహారం కూడా బాగోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గీతానగర్ వరకు ఉన్న రక్షణ గోడను... పొడిగించి తమను ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.

Intro:అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో p0నిరసన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం పట్టణంలో ఎనుముల పల్లి కూడలి అన్న క్యాంటీన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఐదు రూపాయల కె రుచికరమైన నా భోజనం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేయించి నిరుపేదల కడుపు కొట్టే అన్నారు వృద్ధులు నిరుపేదలు పట్టెడన్నం కోసం కాంటీన్ లో వద్ద నిరీక్షించాల్సి పరిస్థితి వచ్చిందన్నారు వెంటనే అన్న క్యాంటీన్ లను వినియోగంలోకి తీసుకువచ్చి నిరుపేదలకు భోజనం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాల్ చేశారు క్యాంటీన్ ముందు ఉచితంగా నిరుపేదలకు భోజనం అందించారు


Body:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన


Conclusion:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.