ETV Bharat / state

ఆల్​లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్ - మాచవరంలో ఆల్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

cricket betting gang arrest
cricket betting gang arrest
author img

By

Published : Sep 18, 2020, 3:54 AM IST

కృష్ణా జిల్లాలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్​లోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు వివరించారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారమందటంతో అపార్ట్ మెంట్​లో పోలీసులు దాడులు చేశారు. 25 సెల్ ఫోన్లు ,ల్యాప్ ట్యాప్ ,టీవీ లతో పాటు కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ కుమార్ ,శ్రీనివాస్ , వెంకట నాగ శివప్రసాద్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీలక నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. నిందితులకు క్రికెట్ బుకీలకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్​లోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు వివరించారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారమందటంతో అపార్ట్ మెంట్​లో పోలీసులు దాడులు చేశారు. 25 సెల్ ఫోన్లు ,ల్యాప్ ట్యాప్ ,టీవీ లతో పాటు కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ కుమార్ ,శ్రీనివాస్ , వెంకట నాగ శివప్రసాద్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీలక నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. నిందితులకు క్రికెట్ బుకీలకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి హర్​సిమ్రత్​ రాజీనామా.. కారణమిదే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.