ETV Bharat / state

దేవినేని గాంధీపురం వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సీపీఎం

విజయవాడంలో దేవినేని గాంధీపురంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆధ్వర్యంలో... దేవినేని గాందీపురంలో ధర్నా చేపట్టారు.

author img

By

Published : Oct 19, 2020, 5:31 PM IST

cpi protest for house pattas in devineni gandhi puram vijayawada krishna district
దేవినేని గాంధీపురం వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సీపీఎం

కృష్ణా జిల్లా విజయవాడంలోని దేవినేని గాంధీపురంలో 40 సంవత్సరాలుగా నివాసముంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పేర్కొంటూ... పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరెంట్​ బిల్లులు, ఇంటి పన్నులు, డ్రైనేజీ ఛార్జీలు చెల్లిస్తూ... అనేక మౌలిక సదుపాయాలు సాధించుకున్న ఆ కుటుంబాలను అక్కడి నుంచి తరలించడం సరైంది కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు అన్నారు. ఇళ్లను తొలగించొద్దని, పట్టాలు ఇవ్వాలని కోరినందుకు పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు.

గతంలో తెదేపా, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వాలు స్థానికులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నామని ఒక్కొక్కరి నుంచి రూ. 550 వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వకపోగా శనివారం అకస్మాత్తుగా ఇళ్లను ఖాళీ చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టాల ఇస్తామన్న హామీతో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే తన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రాంతవాసుల తరఫున అందోళన చేపడతామన్నారు.

కృష్ణా జిల్లా విజయవాడంలోని దేవినేని గాంధీపురంలో 40 సంవత్సరాలుగా నివాసముంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పేర్కొంటూ... పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరెంట్​ బిల్లులు, ఇంటి పన్నులు, డ్రైనేజీ ఛార్జీలు చెల్లిస్తూ... అనేక మౌలిక సదుపాయాలు సాధించుకున్న ఆ కుటుంబాలను అక్కడి నుంచి తరలించడం సరైంది కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు అన్నారు. ఇళ్లను తొలగించొద్దని, పట్టాలు ఇవ్వాలని కోరినందుకు పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు.

గతంలో తెదేపా, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వాలు స్థానికులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నామని ఒక్కొక్కరి నుంచి రూ. 550 వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వకపోగా శనివారం అకస్మాత్తుగా ఇళ్లను ఖాళీ చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టాల ఇస్తామన్న హామీతో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే తన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రాంతవాసుల తరఫున అందోళన చేపడతామన్నారు.

ఇదీ చూడండి

'ప్రభుత్వానికి భూములిచ్చి మేము కష్టాలు పడుతున్నాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.