కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి విస్తృతమవుతోంది. డివిజన్ పరిధిలో మొత్తం 428 కేసులు నమోదు కాగా వారిలో పదిమంది వైరస్తో మృతి చెందినట్లు ఆర్డీవో శ్రీనికుమార్ తెలిపారు. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో 92 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గుడివాడ రూరల్లో ఎనిమిది, నందివాడ మండలంలో 26, మండవల్లి మండలంలో 17, పామర్రు మండలంలో 74, గుడ్లవల్లేరు మండలంలో 36, ముదినేపల్లి మండల పరిధిలో 45, కైకలూరు మండలంలో 66, పెదపారుపూడి మండలంలో 18, కలిదిండి మండలంలో 46 కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమైనట్లు వివరించారు.
డివిజన్ పరిధిలో కరోనా వైరస్ అధికంగా ఉన్న 110 చోట్ల కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రజలంతా తప్పనిసరి అయితేనే బయటకు రావాలని.. బయటకు వచ్చేవారు ముఖానికి మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆర్డీవో శ్రీని కుమార్ సూచించారు.
ఇదీ చదవండి 'మాణిక్యాలరావు మరణం భాజపాకు తీరని లోటు'