ETV Bharat / state

జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : Mar 21, 2021, 8:44 PM IST

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 1,390 మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత
జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో అక్రమంగా రవాణా చేస్తున్న 1,390 తెలంగాణ మద్యం సీసాలను వత్సవాయి, పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి కారులో 1000 మద్యం సీసాలను రవాణా చేస్తుండగా... వత్సవాయి చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ సోమేశ్వరరావు తనిఖీ చేసి... మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం నుంచి ద్విచక్ర వాహనాల్లో 390 మద్యం సీసాలను రవాణా చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పెనుగంచిప్రోలు ఎస్సై రామకృష్ణ అరెస్టు చేశారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు ఎస్ఐలను జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ రివార్డులతో సత్కరించారు.

ఇదీ చదవండి:

అదుపు తప్పి లారీ బోల్తా.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో అక్రమంగా రవాణా చేస్తున్న 1,390 తెలంగాణ మద్యం సీసాలను వత్సవాయి, పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి కారులో 1000 మద్యం సీసాలను రవాణా చేస్తుండగా... వత్సవాయి చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ సోమేశ్వరరావు తనిఖీ చేసి... మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం నుంచి ద్విచక్ర వాహనాల్లో 390 మద్యం సీసాలను రవాణా చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పెనుగంచిప్రోలు ఎస్సై రామకృష్ణ అరెస్టు చేశారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు ఎస్ఐలను జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ రివార్డులతో సత్కరించారు.

ఇదీ చదవండి:

అదుపు తప్పి లారీ బోల్తా.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.