ETV Bharat / state

పిల్లల కోసం ప్రత్యేకంగా.. ఫ్రెండ్లీ పోలీస్​

author img

By

Published : Nov 18, 2020, 6:53 PM IST

ప్రస్తుత సామాజిక పరిస్థితులను బట్టి.. తెలిసి తెలియని వయస్సులో పిల్లలు చేసే పనులకు.. బాల్యం బలైపోతుంది. దీంతో పిల్లలకు పోలీసుల సహాయం తప్పనిసరైపోయింది. ఈ విషయం గుర్తించిన పోలీసులు పిల్లలతో దోస్తీ చేసేందుకు సిద్దమయ్యారు. అల్లరి చేస్తూ అలాపన కోరుకునే వయస్సును.. ఆడిస్తూ అదుపులోకి తీసుకునేందుకు.. ప్రత్యేకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్​ను ఏర్పాటు చేస్తున్నారు.

Child Friendly POlice Stations
పిల్లల కోసం ప్రత్యేకంగా పోలీస్​ స్టేషన్​లు


పెద్ద వాళ్లే పోలీస్​ స్టేషన్​కు వెళ్లాలంటే వందసార్లు ఆలోచిస్తారు.. ఇక పిల్లలు అయితే ఆపేరు చెబితేనే వణికిపోతారు. పిల్లల్లో ఈ భయాన్ని పోగొట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు ఛైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నారు. శిశు సంక్షేమ అధికారుల సూచనలతో డివిజన్​కొక పీఎస్​లో చిన్నారుల సమస్యలు వినేందుకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవంబర్ 19న రెండు ప్రాంతాల్లోని పోలీస్​ స్టేషన్​లో ఈ తరహా పీఎస్​లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మచిలీపట్నం, గుడివాడల్లో ముందుగా వీటిని ప్రారంభించనున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్​..

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్​లో 14 వేల మంది బాల కార్మికులు, వీధి బాలలను పోలీసులు రక్షించారు. దీంతో పోలీస్​ స్టేషన్లలో ప్రత్యేకించి పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని కొన్ని పోలీస్​ స్టేషన్ల రూపురేఖలు మారుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కో పోలీస్​ డివిజిన్​లో ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

పిల్లలకు ప్రత్యేకం..

వీటి కోసం ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్​లలోనే పిల్లల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. ఆగదిలో చిన్నారులు ఆడుకునేందుకు బొమ్మలు, ఆట వస్తువులు ఉంచుతారు. అందమైన బొమ్మలతో పెయింటింగ్ వేసి గోడలను అందంగా తీర్చిదిద్దారు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలతో కలిసి మహిళల ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి కోసం ఈ గదులు ఎంతగానే ఉపయోగపడతాయంటున్నారు. మైనర్లు ఫిర్యాదు చేసేందు వస్తే.. ఛైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లో ఉండే పోలీసు సిబ్బంది వారికి సహాయం చేస్తారని ఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి...

శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు


పెద్ద వాళ్లే పోలీస్​ స్టేషన్​కు వెళ్లాలంటే వందసార్లు ఆలోచిస్తారు.. ఇక పిల్లలు అయితే ఆపేరు చెబితేనే వణికిపోతారు. పిల్లల్లో ఈ భయాన్ని పోగొట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు ఛైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నారు. శిశు సంక్షేమ అధికారుల సూచనలతో డివిజన్​కొక పీఎస్​లో చిన్నారుల సమస్యలు వినేందుకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవంబర్ 19న రెండు ప్రాంతాల్లోని పోలీస్​ స్టేషన్​లో ఈ తరహా పీఎస్​లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మచిలీపట్నం, గుడివాడల్లో ముందుగా వీటిని ప్రారంభించనున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్​..

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్​లో 14 వేల మంది బాల కార్మికులు, వీధి బాలలను పోలీసులు రక్షించారు. దీంతో పోలీస్​ స్టేషన్లలో ప్రత్యేకించి పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని కొన్ని పోలీస్​ స్టేషన్ల రూపురేఖలు మారుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కో పోలీస్​ డివిజిన్​లో ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

పిల్లలకు ప్రత్యేకం..

వీటి కోసం ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్​లలోనే పిల్లల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. ఆగదిలో చిన్నారులు ఆడుకునేందుకు బొమ్మలు, ఆట వస్తువులు ఉంచుతారు. అందమైన బొమ్మలతో పెయింటింగ్ వేసి గోడలను అందంగా తీర్చిదిద్దారు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలతో కలిసి మహిళల ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి కోసం ఈ గదులు ఎంతగానే ఉపయోగపడతాయంటున్నారు. మైనర్లు ఫిర్యాదు చేసేందు వస్తే.. ఛైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లో ఉండే పోలీసు సిబ్బంది వారికి సహాయం చేస్తారని ఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి...

శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.