ముందురోజు వరకు కూడా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న రాజధాని రైతు.. నన్నపనేని వెంకటేశ్వరరావు తెల్లారేసరికి గుండెపోటుతో మరణించటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 4 ఎకరాలిచ్చిన రైతు కుటుంబానికి ఈ ప్రభుత్వం తీరని శోకాన్ని బదులిచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా చేసిన నమ్మకద్రోహానికి ఇప్పటికే 65 మంది రాజధాని రైతులు, రైతుకూలీలు ప్రాణాలిచ్చారన్న ఆయన...ఇంకా ఎంతమంది రైతులు బలికావాలని నిలదీశారు. ఇన్ని కుటుంబాలు ఇక్కడ గుండెలు పగిలే బాధల్లో ఉంటే ఈ పాలకులకి కనీసం వచ్చి ఓదార్చే తీరికలేదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి