ETV Bharat / state

కూలీల ఆటోను ఢీకొట్టిన కారు 16 మందికి గాయాలు

author img

By

Published : Mar 12, 2021, 3:19 AM IST

ఆటోను కారు ఢీకొన్న ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా తిరువూరు పట్టణ సమీపంలోని కట్లేరు వంతెన వద్ద జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా వ్యవసాయ కూలీలు కాగా.. పనులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

auto car accident
ఆటోను ఢీకొట్టిన కారు 16 మందికి గాయాలు

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ సమీపంలోని కట్లేరు వంతెన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరువూరు మండలం లక్ష్మీపురం శివారు రాయగూడెంనకు చెందిన 14 మంది వ్యవసాయ కూలీలు మిర్చి కోత పనుల నిమిత్తం గంపలగూడెం మండలం ఊటుకూరుకు వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో వ్యవసాయ కూలీలతో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఏసమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ సమీపంలోని కట్లేరు వంతెన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరువూరు మండలం లక్ష్మీపురం శివారు రాయగూడెంనకు చెందిన 14 మంది వ్యవసాయ కూలీలు మిర్చి కోత పనుల నిమిత్తం గంపలగూడెం మండలం ఊటుకూరుకు వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో వ్యవసాయ కూలీలతో పాటు కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఏసమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుత్తులపుట్టులో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.