ETV Bharat / state

ఇంటికి చేరిన అబ్దుల్ సలీమ్ మృతదేహం

గోదావరి నదిలో పాపికొండలు విహార యాత్ర పడవ ప్రమాదంలో మృతి చెందిన అబ్దుల్ సలీమ్ మృతదేహం స్వగృహానికి తరలించారు.

author img

By

Published : Sep 18, 2019, 12:04 AM IST

బోటు ప్రమాదం
ఇంటికి చేరిన అబ్దుల్ సలీమ్ మృతదేహం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులోని సలీమ్ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. సలీమ్ భౌతికకాయాన్ని చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా సమన్వకర్త యార్లగడ్డ వెంకట్రావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబీకులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రకటించిన 10లక్షల పరిహారం సత్వరమే అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం రెవెన్యూ అధికారులు 5 వేల రూపాయలను మృతుని కుటుంబానికి అందచేశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిహారం త్వరగా అందించాలని కోరారు.

ఇంటికి చేరిన అబ్దుల్ సలీమ్ మృతదేహం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులోని సలీమ్ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. సలీమ్ భౌతికకాయాన్ని చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా సమన్వకర్త యార్లగడ్డ వెంకట్రావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబీకులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రకటించిన 10లక్షల పరిహారం సత్వరమే అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం రెవెన్యూ అధికారులు 5 వేల రూపాయలను మృతుని కుటుంబానికి అందచేశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిహారం త్వరగా అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి.

విజయవాడలో భారీ వర్షం,రహదారులన్నీ జలమయం

Intro:AP_RJY_99_AP_DGP_GOWTHAM_SAWANG_PRESS_MEET_AVB_AP10166
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోదావరి లో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించి ఏరియల్ సర్వే నిర్వహించామని అన్నారు. ప్రమాదానికి సంబంధించి అధికారులతో మాట్లాడటం జరిగింది అన్నారు. బోట్ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని అలాగే బోటు వద్దకెళ్లి దేవిపట్నం ఎస్ఐ అన్ని సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారన్నారు .అయితే ఇకపై ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నదిలో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. నదుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం కమిటీతోను,ప్రభుత్వంతో చర్చించి రివర్ పోలీసులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. బోటు వందల అడుగుల లోతులో ఉండటం తో దాన్ని గుర్తించడం కష్టమవుతుందని అధునాతన పరికరాలు తీసుకువచ్చి గుర్తిస్తామన్నారు . కచ్చులూరు గ్రామస్తులు కొంతమందిని కాపాడడం జరిగిందని ఆ గ్రామస్తులను పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నామని అలాగే ప్రభుత్వం తో చర్చించి వారికి తగిన గుర్తింపు బహుమానాలు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా సహాయక చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు .


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.