ETV Bharat / state

ఇంటర్ లో 45శాతం మార్కులుంటే చాలు..ఈఏపీసెట్ కు అర్హులే

author img

By

Published : Sep 3, 2022, 12:04 PM IST

ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ కోసం ఇంటర్‌ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్‌ మొదటి , రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకుంటే రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

EAPCET
EAPCET

ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ కోసం ఇంటర్‌ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్‌ మొదటి , రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకుంటే రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది . గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఉన్నా అర్హులే . రిజర్వుడు అభ్యర్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి . కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అందర్నీ ఉత్తీర్ణులు చేసి , కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత మార్కులు తగ్గటంతో సడలింపులు ఇచ్చారు. మినహాయింపు ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తుంది.

ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ కోసం ఇంటర్‌ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంటర్‌ మొదటి , రెండో ఏడాదిలో కలిపి 45 శాతం లేకుంటే రెండో ఏడాదిలోనే 45 శాతం మార్కులు ఉన్నా ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది . గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఉన్నా అర్హులే . రిజర్వుడు అభ్యర్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి . కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అందర్నీ ఉత్తీర్ణులు చేసి , కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. మార్కుల మెరుగుకు సప్లిమెంటరీ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత మార్కులు తగ్గటంతో సడలింపులు ఇచ్చారు. మినహాయింపు ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తుంది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.