ETV Bharat / state

రహదారులపై బొమ్మలతో కరోనాపై అవగాహన

author img

By

Published : Apr 18, 2020, 12:56 PM IST

కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యేలా ఇప్పటికే వివిధ శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వారికి తోడుగా నిలుస్తున్నారు. విజయవాడలో రహదారులపై కొవిడ్​కు సంబంధించిన చిత్రాలు గీస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

awareness on corona with paintings on roads in vijayawada
విజయవాడ రహదారిపై కొవిడ్ చిత్రాలతో అవగాహన

కృష్ణా జిల్లా విజయవాడలో అధికార యంత్రాంగం, నగర పాలక సంస్థ అధికారులు కరోనాపై ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర పెయింటింగ్ కళాకారులు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పలు ప్రధాన కూడళ్లలో కొవిడ్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిత్రాలు వేస్తున్నారు. కరోనా వైరస్ చిత్రాన్ని గీసి 'లాక్ డౌన్ పాటిద్దాం...కరోనాను తరిమికొడదాం' అనే నినాదాలు రాస్తున్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో అనుక్షణం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలుచేస్తున్న పోలీసులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది, ప్రచార సాధనాల ద్వారా అవగాహన కల్పిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు చెబుతూ రహదారులపై బొమ్మలు వేస్తున్నారు. తమ వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా పెయింటింగ్​లు వేస్తున్నట్లు కార్మికుల సంఘం సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

కరోనాపై విస్తృత ప్రచారం.. రోడ్డుపై చిత్రాలతో ప్రయత్నం

కృష్ణా జిల్లా విజయవాడలో అధికార యంత్రాంగం, నగర పాలక సంస్థ అధికారులు కరోనాపై ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర పెయింటింగ్ కళాకారులు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పలు ప్రధాన కూడళ్లలో కొవిడ్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిత్రాలు వేస్తున్నారు. కరోనా వైరస్ చిత్రాన్ని గీసి 'లాక్ డౌన్ పాటిద్దాం...కరోనాను తరిమికొడదాం' అనే నినాదాలు రాస్తున్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో అనుక్షణం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలుచేస్తున్న పోలీసులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది, ప్రచార సాధనాల ద్వారా అవగాహన కల్పిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు చెబుతూ రహదారులపై బొమ్మలు వేస్తున్నారు. తమ వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా పెయింటింగ్​లు వేస్తున్నట్లు కార్మికుల సంఘం సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

కరోనాపై విస్తృత ప్రచారం.. రోడ్డుపై చిత్రాలతో ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.