ETV Bharat / state

ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదల

author img

By

Published : Sep 25, 2020, 10:23 PM IST

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా 40,890 అర్హత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని స్పష్టం చేసింది.

ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదల.. నారీమణులదే హవా
ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదల.. నారీమణులదే హవా

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా 40,890 అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఐసెట్‌ ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించామని, రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు.

తొలి ఆరు వారివే..

మొదటి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల అభ్యర్థులు బీసీ, ఎస్సీ కులాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఇందులో నలుగురు విద్యార్థినులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మొత్తం 352 కళాశాలల్లో 44,084 సీట్లు ఉన్నాయని వివరించారు. ఎంసీఏ కోర్సులో 130 కళాశాలల్లో 8,558 సీట్లు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

30 నుంచి డౌన్​లోడ్..

ఎంబీఏలో కన్వీనర్ కోటా కింద 31,468 సీట్లు ఉండగా.. ఎంసీఏలో కన్వీనర్ కోటా పరిధిలో 6,229 సీట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్ధులు తమ ర్యాంక్ కార్డులను ఈ నెల 30 నుంచి ఉన్నత విద్యా మండలి సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఐసెట్‌ ఉత్తీర్ణత శాతం ఈసారి తగ్గిందన్నారు.

ఈసారి తగ్గింది..

2018లో 92.6 శాతం మంది ఉత్తీర్ణులు కాగా 2019లో 90.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈసారి మాత్రం 78.6 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు.

ఆ ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో..

ఇంజినీరింగ్ విభాగంలో 1,56,899 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, మెడిసిన్‌ విభాగాల్లో 75,834 మంది హాజరయ్యారన్నారు. కరోనా వల్ల ఎంసెట్​లో 21 మంది, ఐసెట్‌లో ఆరుగురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని చెప్పారు. వీరికి అక్టోబరు ఏడున పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్‌ ఫలితాలను అక్టోబరు మొదటి వారంలో ప్రకటించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దానికి ఉమ్మడి పరీక్ష..

నవంబరు మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించబోతున్నామని ప్రకటించారు అధికారులు. సాధారణంగా పదో తరగతి పరీక్షల ద్వారానే ఈ ప్రవేశాలు ఉండేవని.. ఈసారి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేనందున.. ఓ పరీక్ష నిర్వహించాలని ఆర్‌జీకేటీ తీర్మానం చేసిందన్నారు. పార్ట్- 1లో 50 మార్కులకు గణితం.. పార్ట్- 2లో మరో 50 మార్కులకు సైన్స్ ప్రశ్నలు ఉంటాయన్నారు. వంద మంది విద్యార్ధులుంటే.. ప్రతి మండలానికి ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు.

తెలంగాణలోనూ పరీక్షా కేంద్రం..

15 శాతం నాన్‌ లోకల్‌ కేటగిరీకి అవకాశం కల్పించాల్సి ఉన్నందున.. తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్ష పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఉంటుందని.. నమూనా ప్రశ్నాపత్రం.. సిలబస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : తెలుగుజాతి ఉన్నంతవరకు బాలు ఉంటారు: జస్టిస్ ఎన్.వీ. రమణ

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా 40,890 అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఐసెట్‌ ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించామని, రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు.

తొలి ఆరు వారివే..

మొదటి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల అభ్యర్థులు బీసీ, ఎస్సీ కులాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఇందులో నలుగురు విద్యార్థినులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మొత్తం 352 కళాశాలల్లో 44,084 సీట్లు ఉన్నాయని వివరించారు. ఎంసీఏ కోర్సులో 130 కళాశాలల్లో 8,558 సీట్లు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

30 నుంచి డౌన్​లోడ్..

ఎంబీఏలో కన్వీనర్ కోటా కింద 31,468 సీట్లు ఉండగా.. ఎంసీఏలో కన్వీనర్ కోటా పరిధిలో 6,229 సీట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్ధులు తమ ర్యాంక్ కార్డులను ఈ నెల 30 నుంచి ఉన్నత విద్యా మండలి సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఐసెట్‌ ఉత్తీర్ణత శాతం ఈసారి తగ్గిందన్నారు.

ఈసారి తగ్గింది..

2018లో 92.6 శాతం మంది ఉత్తీర్ణులు కాగా 2019లో 90.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈసారి మాత్రం 78.6 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు.

ఆ ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో..

ఇంజినీరింగ్ విభాగంలో 1,56,899 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, మెడిసిన్‌ విభాగాల్లో 75,834 మంది హాజరయ్యారన్నారు. కరోనా వల్ల ఎంసెట్​లో 21 మంది, ఐసెట్‌లో ఆరుగురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని చెప్పారు. వీరికి అక్టోబరు ఏడున పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్‌ ఫలితాలను అక్టోబరు మొదటి వారంలో ప్రకటించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దానికి ఉమ్మడి పరీక్ష..

నవంబరు మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహించబోతున్నామని ప్రకటించారు అధికారులు. సాధారణంగా పదో తరగతి పరీక్షల ద్వారానే ఈ ప్రవేశాలు ఉండేవని.. ఈసారి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేనందున.. ఓ పరీక్ష నిర్వహించాలని ఆర్‌జీకేటీ తీర్మానం చేసిందన్నారు. పార్ట్- 1లో 50 మార్కులకు గణితం.. పార్ట్- 2లో మరో 50 మార్కులకు సైన్స్ ప్రశ్నలు ఉంటాయన్నారు. వంద మంది విద్యార్ధులుంటే.. ప్రతి మండలానికి ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు.

తెలంగాణలోనూ పరీక్షా కేంద్రం..

15 శాతం నాన్‌ లోకల్‌ కేటగిరీకి అవకాశం కల్పించాల్సి ఉన్నందున.. తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్ష పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఉంటుందని.. నమూనా ప్రశ్నాపత్రం.. సిలబస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : తెలుగుజాతి ఉన్నంతవరకు బాలు ఉంటారు: జస్టిస్ ఎన్.వీ. రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.