ETV Bharat / state

కరోనాపై అవగాహన కోసం పెయింటింగ్ - విజయవాడలో కరోనాపై పెయింటింగ్

లాక్​డౌన్ సమయంలో వాహనాలపై రాకపోకలు నిర్వహిస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ఏపీ పెయింటింగ్ వర్కర్స్ ముందుకు వచ్చారు. కరోనా వైరస్​ నుంచి ఎలా రక్షించుకోవాలో వివరిస్తూ పెయింటింగ్ వేశారు.

ap painting workers association painting on corona in vijayawada
కరోనాపై అవగాహన కోసం పెయింటింగ్
author img

By

Published : Apr 18, 2020, 3:43 AM IST

కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించేందుకు ఏపీ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. విజయవాడ అజిత్​సింగ్ నగర్ ప్రధాన కూడలిలో కరోనా వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించే పెయింట్ వేశారు. పెయింటింగ్ అసోసియేషన్ సభ్యులు, మూడవ పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజు సిబ్బంది నేతృత్వంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు సరైన అవగాన లేక రాకపోకలు సాగిస్తున్న తరుణంలో వారిలో చైతన్యం తెచ్చేందుకే ఈ పెయింటింగ్ వేయించినట్లు మూడవ పట్టణ సీఐ బాలరాజు వివరించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టుల సహకారంతో ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చుననే సందేశం పెయింటింగ్ రూపంలో చక్కగా వివరించారన్నారు.

కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించేందుకు ఏపీ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. విజయవాడ అజిత్​సింగ్ నగర్ ప్రధాన కూడలిలో కరోనా వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించే పెయింట్ వేశారు. పెయింటింగ్ అసోసియేషన్ సభ్యులు, మూడవ పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజు సిబ్బంది నేతృత్వంలో ఈ కార్యక్రమంను నిర్వహించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు సరైన అవగాన లేక రాకపోకలు సాగిస్తున్న తరుణంలో వారిలో చైతన్యం తెచ్చేందుకే ఈ పెయింటింగ్ వేయించినట్లు మూడవ పట్టణ సీఐ బాలరాజు వివరించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టుల సహకారంతో ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చుననే సందేశం పెయింటింగ్ రూపంలో చక్కగా వివరించారన్నారు.

ఇదీ చదవండి: నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.