ETV Bharat / state

Anandaiah Medicine: మైలవరంలో ఆనందయ్య మందు పంపిణీ

కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో వైకాపా నాయకులు... ఆనందయ్య మందును పంపిణీ చేశారు. సుమారు ఆరు కేజీల మందును 600 ప్యాకెట్లుగా విభజించి ప్రజలకు అందించారు.

author img

By

Published : Jul 4, 2021, 8:07 PM IST

anandaiah medicine distribution at mylavaram
మైలవరంలో ఆనందయ్య మందు పంపిణీ

కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. వైకాపా నేత అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లా నుంచి సుమారు ఆరు కేజీల మందును తీసుకొచ్చి 600 ప్యాకెట్లుగా విభజించి ప్రజలకు వితరణ చేశారు.

పంపిణీ తీరుపై విమర్శలు

కరోనా మందు ప్యాకెట్లపై స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటోలు ముద్రించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ పబ్లిసిటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక.. మైలవరం పట్టణంలో సుమారు 25 వేల మంది జనాభా ఉంటే.. ఓ సెగ్మెంట్​లో ఉన్న ప్రజలకు మాత్రమే మందు పంపిణీ చేయటంపై మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. వైకాపా నేత అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లా నుంచి సుమారు ఆరు కేజీల మందును తీసుకొచ్చి 600 ప్యాకెట్లుగా విభజించి ప్రజలకు వితరణ చేశారు.

పంపిణీ తీరుపై విమర్శలు

కరోనా మందు ప్యాకెట్లపై స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటోలు ముద్రించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ పబ్లిసిటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక.. మైలవరం పట్టణంలో సుమారు 25 వేల మంది జనాభా ఉంటే.. ఓ సెగ్మెంట్​లో ఉన్న ప్రజలకు మాత్రమే మందు పంపిణీ చేయటంపై మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Pattabi: 'అమరావతిలో భూ దోపిడీ అంటూ.. మళ్లీ ఆవు కథ మొదలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.