ETV Bharat / state

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

author img

By

Published : Jun 19, 2020, 6:42 PM IST

రాష్ట్రంలో భారీగా మద్యం ధరలు పెరిగినందున మద్యం అక్రమ రవాణాకు తెర లేచింది. సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా మద్యాన్ని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా లీలానగర్​లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Alcohol is moving from Telangana is seized in leelanagar krishna district
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్​ ఆదేశాలతో నూజివీడు మండలం లీలా నగర్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విస్సన్నపేట వైపు నుంచి వస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 335 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. న్యాయస్థానానికి తరలిస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్​ ఆదేశాలతో నూజివీడు మండలం లీలా నగర్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విస్సన్నపేట వైపు నుంచి వస్తున్న ఆటో, ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 335 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి.. న్యాయస్థానానికి తరలిస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీచదవండి. రేషన్ సరకులు అందించే వాహనాలను పరిశీలించిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.