ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం... బాలింత మృతి..! - maternity women dies due to negligence of doctors at tiruvuru

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జిల్లాలో బాలింత మృతిచెందింది. శ్వాస అందక... పరిస్థితి విషమించిందని వైద్యులకు తెలిపినా... పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బందే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
author img

By

Published : Nov 24, 2019, 4:55 PM IST

వైద్యుల నిర్లక్ష్యం... బాలింత మృతి..!

కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో... డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతిచెందింది. కోకిలంపాడుకు చెందిన స్వర్ణలత కాన్పు నిమిత్తం వారం రోజుల క్రితం తిరువూరు ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. మంగళవారం శస్త్ర చికిత్స చేయగా... ఆమె బాలుడికి జన్మనిచ్చింది. 3 రోజుల నుంచి స్వర్ణలత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా శ్వాస అందక పరిస్థితి విషమించింది. ఈవిషయం వైద్యులకు తెలిపినా... పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజిదాబీ మాట్లాడుతూ... డెలివరి సమయంలో కొన్ని రుగ్మతల కారణంగా... పరిస్థితి విషమించే అవకాశం ఉందని... వైద్యులు తమవంతు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందన్నారు.

ఇదీ చదవండి: ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు

వైద్యుల నిర్లక్ష్యం... బాలింత మృతి..!

కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో... డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతిచెందింది. కోకిలంపాడుకు చెందిన స్వర్ణలత కాన్పు నిమిత్తం వారం రోజుల క్రితం తిరువూరు ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. మంగళవారం శస్త్ర చికిత్స చేయగా... ఆమె బాలుడికి జన్మనిచ్చింది. 3 రోజుల నుంచి స్వర్ణలత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా శ్వాస అందక పరిస్థితి విషమించింది. ఈవిషయం వైద్యులకు తెలిపినా... పట్టించుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజిదాబీ మాట్లాడుతూ... డెలివరి సమయంలో కొన్ని రుగ్మతల కారణంగా... పరిస్థితి విషమించే అవకాశం ఉందని... వైద్యులు తమవంతు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందన్నారు.

ఇదీ చదవండి: ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు

Intro:ap_vja_15_24_baalintha_mruthi_vydhyula_nirlakshyam_tiruvuru_avb_ap10125

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో ఈ రోజు చోటుచేసుకుంది తిరువూరు మండలం కోకిలంపాడు కు చెందిన స్వర్ణలతను మొదటి కాన్పు నిమిత్తం వారం రోజుల క్రితం ప్రాంతీయ వైద్యశాల లో చేర్పించారు మంగళవారం శస్త్ర చికిత్స చేయగా ఆమె బాలుడికి జన్మ నిచ్చింది మూడు రోజుల నుంచి స్వర్ణలత అనారోగ్యంతో బాధపడుతుంది ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా శ్వాస అందకపోవడంతో పరిస్థితి విషమించింది వైద్యుల బృందం తమ వంతు ప్రయత్నం చేసిన ఆమె కన్నుమూసింది సీరియస్ గా ఉందని చెప్పిన నా వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే స్వర్ణలత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆమె మృతికి కి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజిదాబీ ని వివరణ కోరగా గర్భిణీ సమయంలో కొన్ని రుగ్మతల వల్ల పరిస్థితి విషమించే అవకాశం ఉందని గతంలో గుండె సంబంధిత వ్యాధితో స్వర్ణలత బాధ పడిందని తెలిపారు శ్వాస అందడం లేదని కుటుంబ సభ్యులు చెప్పిన వెంటనే వైద్యులు చివరి ప్రయత్నం చేసిన ఫలించక పోయిందని వివరణ ఇచ్చారు


Body:కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి

కుటుంబ సభ్యులు ఆరోపణ


Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్.. 8008574709, 8500544088

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.