కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలుర హైస్కూల్లోని ఏపీజే అబ్దుల్ కలాం ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ యువ క్రీడాకారులకు 5కే మారథాన్ నిర్వహించారు. కోచ్ గోపి, ట్రైనీ డీఎస్పీ సునీల్, యూత్ లీడర్ శ్రీరాం జయరాంల ఆధ్వర్యంలో స్టేడియం నుంచి బాలుసుపాడు శ్రీ గురుధామ్ వరకూ క్రీడాకారులు అవిశ్రాంతంగా పరుగెత్తి తమ సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో నాలుగేళ్ల చిన్నారులు మొదలుకొని యువకుల వరకూ.... వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పరుగు కొనసాగించి తమ క్రీడా స్ఫూర్తిని తెలియజేశారు. గురుధామ్లో వారికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య యువక్రీడాకారులను అభినందించారు. శ్రీ శివానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు వారికి ఆతిథ్యం ఇచ్చి అభినందనలు తెలిపారు. క్రీడాకారులు మరింతగా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ పరుగు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: