ETV Bharat / state

Ration mafia in AP: వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే

author img

By

Published : Jul 28, 2023, 8:56 AM IST

Updated : Jul 28, 2023, 9:13 AM IST

Ration smuggling in AP: వైసీపీ అధికారంలోకి వచ్చాక.. రేషన్‌ మాఫియా చెలరేగిపోతోంది. రాష్ట్రంలో నెలకు 2 లక్షల 8 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40 శాతం వరకు పక్కదారి పడుతున్నాయంటే అక్రమార్కుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సేకరించేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా అధిక శాతం అక్రమ రవాణా వాహనాల గమ్యస్థానం మాత్రం కాకినాడలోని కొన్ని మిల్లులే. ఒకటీ అరా కృష్ణపట్నం వెళ్తున్నాయి. అక్కడి నుంచి నౌకల్లో విదేశాలకు చేరుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ రవాణా సాగిపోతోంది. పేదల బియ్యం పక్కదారితో ప్రభుత్వ ఖజానాకు ఏటా 4 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది.

Ration mafia in AP
వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే
వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే

Ration smuggling in AP: రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా కార్డుదారులకు కరవైంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్‌.. బండ్ల ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10 నుంచి 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్‌ పథకం కావడంతో.. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అందులోనూ సీఎంకి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి బియ్యం కొనేసి.. బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాలశాఖ.. రైస్‌ ఏజ్‌ టెస్టింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.

కోట్ల రూపాయలు లూటీ.. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతోంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు 39 రూపాయల 35 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9 వేల 618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇందులో 40 శాతం బియ్యం నల్లబజారుకు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40 శాతం అంటే 85 వేల టన్నులు దళారులు కొంటున్నారు. నామమాత్రంగా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు 39 రూపాయల 35 పైసల చొప్పున దాదాపు 4 వేల 13 కోట్లు నష్టం వస్తోంది..

రాష్ట్రమంతటా ఇదే తీరు..

విశాఖ జిల్లాలో.. ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్‌ సీ-2 జోన్‌ పార్క్‌ ఏరియాలోని రేషన్‌ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ 10 కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్‌ పేమెంట్‌గా నగదు చెల్లించారు. కొందరు వాచ్‌మెన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈనెల 9న చాలామందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు బియ్యం తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా.. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారు. లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్‌ చేశారు.

అనకాపల్లి జిల్లా.. రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్‌మన్, ఎండీయూ ఆపరేటర్‌ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కిలోల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్‌ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్‌మెన్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో.. అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. పెళ్లూరులో ఒక మిల్లు నిర్వాహకుడు, వైసీపీ నాయకుడు కలిసి భారీ ఎత్తున చౌకబియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రోత్‌ సెంటర్‌లో మూతపడిన మరో మిల్లులో రహస్యంగా చౌక బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, కొండపి, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో లారీలు, ఆటోల ద్వారా స్థానిక మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్‌ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. తర్వాత కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మూడుసార్లు తనిఖీలు చేసి, 2వేల బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. దీన్ని ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్‌ భర్త మరికొందరితో కలిసి నిర్వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం వంద బస్తాలే పట్టుకున్నట్లు తేల్చారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. మిల్లు లైసెన్సు సస్పెండ్‌ చేసి కేసు పెట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో.. ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్‌ బియ్యం 3వేల 117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 కింటాళ్లు పట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు నమోదు చేసి 2వేల 314 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్‌ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద 17లక్షల 8 వేల విలువ చేసే సుమారు 23 టన్నుల 70 కేజీల బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు 9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు. కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 13 వందల 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లాలో.. ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్‌ 144 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ చిక్కారు. ఈయనపై కేసు నమోదైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్‌ బియ్యానికి సంబంధించి రెండొందల కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో పౌరసరఫరాల గోదాముల్లో 3 వేల టన్నులకుపైగా స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

విజయనగరంలోని.. బాలాజీనగర్‌ -నాగోజిపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి.కాంతారావు తనిఖీ చేయగా.. బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని గుర్తించి కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దంపడుతోంది.

గమ్యస్థానం కాకినాడే.. రాష్ట్రంలో ఏ మూలన రేషన్‌ బియ్యం పట్టుకున్నా.. వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. తమ పార్టీలోని కొందరు నేతలే అక్రమ బియ్యం సేకరణ, ఎగుమతుల్లో సూత్రధారులుగా ఉన్నారని.. వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వారి చేతుల్లోనే నడుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అక్కడ అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు.

బియ్యం ఎగుమతుల గణాంకాలు.. 2019-20లో విదేశాలకు 4 వేల 322 కోట్ల విలువైన 16 లక్షల 94 వేల 364 టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. అదే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 18 వేల 693కోట్ల విలువైన 67లక్షల 32 వేల 448 టన్నుల బియ్యం తరలిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నాటికే 1,439 కోట్ల విలువైన 4లక్షల 79వేల 430 టన్నులు ఎగుమతయ్యాయి. బియ్యం అక్రమ రవాణా ఎంతగా పెరిగిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే

Ration smuggling in AP: రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా కార్డుదారులకు కరవైంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్‌.. బండ్ల ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10 నుంచి 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్‌ పథకం కావడంతో.. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అందులోనూ సీఎంకి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి బియ్యం కొనేసి.. బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాలశాఖ.. రైస్‌ ఏజ్‌ టెస్టింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.

కోట్ల రూపాయలు లూటీ.. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతోంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు 39 రూపాయల 35 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9 వేల 618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇందులో 40 శాతం బియ్యం నల్లబజారుకు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40 శాతం అంటే 85 వేల టన్నులు దళారులు కొంటున్నారు. నామమాత్రంగా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు 39 రూపాయల 35 పైసల చొప్పున దాదాపు 4 వేల 13 కోట్లు నష్టం వస్తోంది..

రాష్ట్రమంతటా ఇదే తీరు..

విశాఖ జిల్లాలో.. ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్‌ సీ-2 జోన్‌ పార్క్‌ ఏరియాలోని రేషన్‌ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ 10 కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్‌ పేమెంట్‌గా నగదు చెల్లించారు. కొందరు వాచ్‌మెన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈనెల 9న చాలామందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు బియ్యం తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా.. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారు. లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్‌ చేశారు.

అనకాపల్లి జిల్లా.. రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్‌మన్, ఎండీయూ ఆపరేటర్‌ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కిలోల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్‌ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్‌మెన్‌ను సస్పెండ్‌ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో.. అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. పెళ్లూరులో ఒక మిల్లు నిర్వాహకుడు, వైసీపీ నాయకుడు కలిసి భారీ ఎత్తున చౌకబియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రోత్‌ సెంటర్‌లో మూతపడిన మరో మిల్లులో రహస్యంగా చౌక బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, కొండపి, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో లారీలు, ఆటోల ద్వారా స్థానిక మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్‌ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. తర్వాత కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మూడుసార్లు తనిఖీలు చేసి, 2వేల బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. దీన్ని ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్‌ భర్త మరికొందరితో కలిసి నిర్వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం వంద బస్తాలే పట్టుకున్నట్లు తేల్చారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. మిల్లు లైసెన్సు సస్పెండ్‌ చేసి కేసు పెట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో.. ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్‌ బియ్యం 3వేల 117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 కింటాళ్లు పట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు నమోదు చేసి 2వేల 314 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్‌ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద 17లక్షల 8 వేల విలువ చేసే సుమారు 23 టన్నుల 70 కేజీల బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు 9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు. కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 13 వందల 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లాలో.. ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్‌ 144 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ చిక్కారు. ఈయనపై కేసు నమోదైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్‌ బియ్యానికి సంబంధించి రెండొందల కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో పౌరసరఫరాల గోదాముల్లో 3 వేల టన్నులకుపైగా స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

విజయనగరంలోని.. బాలాజీనగర్‌ -నాగోజిపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి.కాంతారావు తనిఖీ చేయగా.. బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని గుర్తించి కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దంపడుతోంది.

గమ్యస్థానం కాకినాడే.. రాష్ట్రంలో ఏ మూలన రేషన్‌ బియ్యం పట్టుకున్నా.. వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. తమ పార్టీలోని కొందరు నేతలే అక్రమ బియ్యం సేకరణ, ఎగుమతుల్లో సూత్రధారులుగా ఉన్నారని.. వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వారి చేతుల్లోనే నడుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అక్కడ అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు.

బియ్యం ఎగుమతుల గణాంకాలు.. 2019-20లో విదేశాలకు 4 వేల 322 కోట్ల విలువైన 16 లక్షల 94 వేల 364 టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. అదే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 18 వేల 693కోట్ల విలువైన 67లక్షల 32 వేల 448 టన్నుల బియ్యం తరలిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నాటికే 1,439 కోట్ల విలువైన 4లక్షల 79వేల 430 టన్నులు ఎగుమతయ్యాయి. బియ్యం అక్రమ రవాణా ఎంతగా పెరిగిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Last Updated : Jul 28, 2023, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.