ETV Bharat / state

attack on doctor: నరసరావుపేటలో వైద్యురాలిపై కత్తితో దాడి..

author img

By

Published : Sep 24, 2021, 9:05 AM IST

Updated : Sep 24, 2021, 3:33 PM IST

attack
వైద్యురాలిపై కత్తితో దాడి

09:01 September 24

attack on doctor

ఓ ఆగంతకుడు మహిళా వైద్యురాలిపై  కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణ శివారులో జరిగింది. దేవరకొండ మాధవిలత అనే మహిళ స్థానికంగా ఓ ప్రైవేట్ వైద్యశాల ఏర్పాటు చేసుకుని వైద్యసేవలు అందిస్తోంది. ఆమె భర్త స్కానింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అయితే వారి వైద్యశాలలో మందుల దుకాణం పెట్టుకునేందుకు పగడాల రమేశ్​ అనే వ్యక్తి కోరగా వారు నిరాకరించి మరో వ్యక్తికి అప్పగించారు. దీనిని మనసులో పెట్టుకుని రమేష్​.. తన భర్తకు, మందుల దుకాణం నడుపుకునే వ్యక్తి ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టి వేధిస్తున్నాడని వైద్యురాలు తెలిపింది. రమేశ్ వైఖరిని అతని కుటుంబసభ్యులు తెలిపానని.., తనపై కోపం పెంచుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డులో వెళ్తుండగా వెంటపడి నన్ను కులం పేరుతో దుర్భాషలాడాడని వైద్యురాలు తెలిపారు. అనంతరం కత్తితో దాడి చేశాడని వైద్యురాలు ఆరోపించింది. దాడి జరిగే సమయంలో స్థానికులు అడ్డగించటంతో అక్కడ నుంచి పరారయ్యాడని పేర్కొంది.  గాయాలైన తనని తెలిసిన వ్యక్తి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించారన్నారు. మహిళా వైద్యురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ పగడాల రమేశ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండీ.. 'దావాల దాఖలుకు మళ్లీ పాత గడువే'

09:01 September 24

attack on doctor

ఓ ఆగంతకుడు మహిళా వైద్యురాలిపై  కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణ శివారులో జరిగింది. దేవరకొండ మాధవిలత అనే మహిళ స్థానికంగా ఓ ప్రైవేట్ వైద్యశాల ఏర్పాటు చేసుకుని వైద్యసేవలు అందిస్తోంది. ఆమె భర్త స్కానింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అయితే వారి వైద్యశాలలో మందుల దుకాణం పెట్టుకునేందుకు పగడాల రమేశ్​ అనే వ్యక్తి కోరగా వారు నిరాకరించి మరో వ్యక్తికి అప్పగించారు. దీనిని మనసులో పెట్టుకుని రమేష్​.. తన భర్తకు, మందుల దుకాణం నడుపుకునే వ్యక్తి ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టి వేధిస్తున్నాడని వైద్యురాలు తెలిపింది. రమేశ్ వైఖరిని అతని కుటుంబసభ్యులు తెలిపానని.., తనపై కోపం పెంచుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డులో వెళ్తుండగా వెంటపడి నన్ను కులం పేరుతో దుర్భాషలాడాడని వైద్యురాలు తెలిపారు. అనంతరం కత్తితో దాడి చేశాడని వైద్యురాలు ఆరోపించింది. దాడి జరిగే సమయంలో స్థానికులు అడ్డగించటంతో అక్కడ నుంచి పరారయ్యాడని పేర్కొంది.  గాయాలైన తనని తెలిసిన వ్యక్తి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించారన్నారు. మహిళా వైద్యురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ పగడాల రమేశ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండీ.. 'దావాల దాఖలుకు మళ్లీ పాత గడువే'

Last Updated : Sep 24, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.