గుర్తు తెలియని అస్తిపంజరం లభ్యమైన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. అచ్చమ్మ పాలెం శివారులోని ఓగేరు కాల్వలో అస్థిపంజరాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అది కాల్వలోని పొదల్లో ఇరుక్కుపోయి ఉందని తెలిపారు.
అస్థిపంజరం ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకువచ్చి ఉండవచ్చని భావిస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు పేర్కొన్నారు. క్లూస్ టీమ్ ద్వారా అస్థిపంజరాన్ని ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం